శ్రీకాళహస్తి/ పాపానాయుడుపేట, ఆగష్టు 19, పున్నమి ప్రతినిధి
ఏర్పేడు మండలం పాపా నాయుడు పేట జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఎయిడ్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు పాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. పాస్ స్వచ్ఛంద సంస్థ కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఇంద్రాణి మాట్లాడుతూ అక్రమ సంబంధాల వలన ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందని ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు యుక్త వయసులో ఎలాంటి చెడు వ్యసనాలకు పాల్పడవద్దని తెలిపారు. అనంతరం ఎయిడ్స్ రాకుండా పాటించవలసిన పద్ధతులు కరపత్రం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు


