*పున్నమనవసర ఫోటోలు హరికృష్ణ ఆగస్టు 01 కోట మండలం,*
గిరిజన ప్రాంతంలో నివసించే చిన్నారుల సంక్షేమం మే ఎం వి రావు ఫౌండేషన్ లక్ష్యమని ఎన్వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
శనివారం కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం గిరిజన కాలనీలో విద్యను అభ్యసించే అంగనవాడి ప్రాథమిక పాఠశాల కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులకు చెందూడు గ్రామానికి చెందిన ఎం.వి. రావు ఫౌండేషన్ వారి సౌజన్యంతో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు.
గిరిజన వాడలో ఎన్ వి రావు ఫౌండేషన్ అనునిత్యం వారే అభివృద్ధి కోసం కృషి చేసిందని ఆ క్రమంలో భాగంగా చంద్రశేఖరపురం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థులు అందరికీ పలకాలు, నోట్స్లో, బల్పాలు, 20 మంది విద్యార్థిని,విద్యార్థులకు గిరిజన కాలనీలో గ్రామస్తుల సమక్షంలో పంపిణీ చేశారు.
అనంతరం గ్రామంలోని అన్ని వర్గాల వారికి అమ్మవారు చికెన్ ఫాక్స్ లాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికి హోమియో మందుల పంపిణీ చేశారు.
ఆగస్టు రెండో తేదీ ప్రతిభవంతులకు పురస్కారం రెండవ తేదీ నెల్లూరు పట్టణంలోని రోటరీ క్లబ్ ఆవరణలో జాతీయస్థాయిలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ ప్రాంతాల్లోని అన్ని రంగాల్లో ప్రతిభావంతులైన వారికి గుర్తించి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వాతంత్ర సమరయోధుల పురస్కారాలు 2026 కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది ప్రతిభావంతులను కళాకారులను నాట్య మయూర్లను కళా రంగంలోని వారిని సినీ రంగంలోనే వారిని నాటకం రంగంలో వారిని వివిధ ప్రతిభావంతులను గుర్తించి వారిని సన్మానిస్తున్నట్లు ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ తెలిపారు.
విద్యా సామాగ్రి పంపిణీ హోమియోపతి మందులు పంపిణీ కార్యక్రమంలో చంద్రశేఖరపురం గ్రామస్తుల విద్యార్థులు పాల్గొన్నారు.



