తూర్పు గోదావరి
బిక్కవోలు, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి–ఎన్జీవో బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పీఎస్వీ), అనపర్తి నియోజకవర్గం ఇంచార్జి (ఆర్టీఐ కమిటీ, పీఎస్వీ), పున్నమి ప్రతినిధి శ్రీ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు (రమేష్ నాయుడు) జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి సభ్యురాలు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు (ఆర్టీఐ కమిటీ, పీఎస్వీ) శ్రీమతి సిరిసిపల్లి మణికుమారి చిన్ననాటి గురువు, ప్రముఖ బుల్లితెర నటుడు, మూవీ ఆర్టిస్ట్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన జబర్దస్త్ సత్తిపండు (లెక్కల మాస్టారు) వీడియో సందేశం ద్వారా రమేష్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మణికుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారిపై తనకు ఎంతో గౌరవం, అభిమానముందని తెలిపారు. చదువుతో పాటు విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు, ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, దానిని అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సహించి ఉన్నత మార్గంలో నడిపించారని పేర్కొన్నారు. అలాగే దేశం పట్ల, సమాజం పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని, ఆపదలో ఉన్న తోటి మనిషిని గుర్తించి తమవంతు సహాయ సహకారాలు అందించాలనే సేవా భావాన్ని కూడా చిన్ననాటి నుంచే గురువులు తమలో పెంపొందించారని మణికుమారి తెలిపారు. తనకు చిన్ననాట విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారు, తన భర్త రమేష్ నాయుడు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా తనకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితానికి విలువైన మార్గనిర్దేశం చేసిన గురువులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని శ్రీమతి సిరిసిపల్లి మణికుమారి పేర్కొన్నారు.