Tuesday, 12 May 2026

Blog

తిరుపతి

పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఊంజల సేవ.

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆలయంలోని మండపంలో స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా ఊయలలో అధిష్టింప చేసి వేదపండితుల మంత్రోచ్చారణలతో మేళతాళాలు,మంగళవాయిద్యాల నడుమ ఎంతో వైభవం గా ఊంజలసేవ నిర్వహించారు.భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు.

ఖమ్మం

ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు.

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి) శ్రావణ మాసం 3 వ శుక్రవారం వరలక్ష్మి వ్రత వేడుకలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండే అమ్మ వారి కి పూజలు నిర్వహించిన అనంతరం ఆడపడుచు లని పిలిచి వాయినాలు అందజేసుకొని ఆశీస్సులు తీసుకున్నారు అమ్మ వారి కరుణ కటాక్షలు అందరి మీద ఉండాలి పూజలు చేశారు. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిట కిటలాడయి.

ఆంధ్రప్రదేశ్

పలు దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ): నెల్లూరులో నామినేటెడ్ పదవుల సందడి మొదలు కాబోతోంది. ఆలయ పాలకమండలి ఛైర్మన్లకు, సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, వేదగిరి నరసింహస్వామి దేవస్థానం, మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంతో పాటు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో చైర్మన్ పదవులను, బోర్డు మెంబర్స్ పదవులను దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు.

యాదాద్రి భువనగిరి

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో హర్ ఘార్ తీరంగా యాత్ర జిల్లా వర్క్ షాప్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ సుర్వి శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవల మహేందర్ గారు విచ్చేశారు విశిష్ట అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఉట్కూరు అశోక్ గౌడ్ గారు పాల్గొన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు చేవెళ్ల మహేందర్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మన దేశంలో ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలి మరియు మహనీయుల విగ్రహాలు శుదీకరణ చేసి వారిని గౌరవించుకోవాలి విభజన గాయాల స్మృతి దినం గా ఈ వారం రోజులు పండుగ సంబరాలు చేసుకోవాలి దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిరంగా యాత్ర జిల్లా కో కన్వీనర్లు కమిటీ కారి కృష్ణ దయ్యాల కుమారస్వామి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి మందడి చిత్తరంజన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మండల అధ్యక్షులు మండల కన్వీనర్లు కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. *భవదీయ* *కమిటీ కార్ కృష్ణ* *దయ్యాల కుమారస్వామి* *తిరంగా యాత్ర కో కన్వీనర్లు*…

యాదాద్రి భువనగిరి

పండుగ సాయన్న జయంతిముదిరాజు సంఘం ఆధ్వర్యంలో

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది.. ముఖ్య అతిథిలుగా హాజరైన కొలుపుల హరినాద్ గారు,పెంట నరసింహ గారు మాట్లాడుతూ పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర అని పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు అని,పేదప్రజలకు దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడు. కానీ రాబిన్‌హుడ్ లాగా పండుగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టేవాడని,సాయన్న 1840 నుంచి 1900 మధ్య కాలానికి చెందినవాడని,అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. అతను తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌కు దగ్గర నవాబ్‌పేట మండలం, మెరుగోనిపల్లె గ్రామానికి చెందినవాడు అని అతను గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు అని,20 కేజీల గుండును అవలీలగా ఒక్కచేత్తో లేపే వాడట. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడుఅనీ,అతను పేదవర్గాలకు సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ ఆధిపత్య వర్గాల వాళ్లు బందిపోటుగా అతనిని చిత్రించారు అని,ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదాములు పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టాడు ,సాయన్న సొంతంగా ఆయుధాలు తయారుచేసుకున్నాడు ,ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని తెలిపారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ట్ ఛైర్మన్ పాశం సంజయ్ బాబు , ఇట్టబోయిన గోపాల్,గొర్రెంకల శివశంకర్,ఎనబోయిన జంగీర్,సాదు విజయ్,ఉడుత భాస్కర్,పిట్టల బాలరాజు,దిద్దికాడి భగత్,కమ్మ వెంకటేష్,కొలుపుల నాగరాజు,శాగంటి నర్సింహ,గుర్రాల మల్లేష్,బీసుకుంట్ల జంగిర్,బోయిని బాలయ్య,కానుక బాలరాజు,తుమ్మల నగేష్,మేడబోయిన సాయి,బూస కిష్టయ్య,సిదేన్కి కోటయ్య,కొలుపుల గణేష్,శ్రీకాంత్, బండి సూరి,బండి మహేష్,సాదు మనోజ్,పెంట నితీష్,ఇట్టబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి

సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించిన మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) *ఈరోజు భువనగిరి పట్టణ 23వ వార్డులో శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం పూజలు మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించి ఈవ్రతంలో పాల్గొన్న మహిళలందరికీ వాయనాలు ఒక్కరికీ ఒక్కరు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలందరూ వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు ఆ అమ్మవారిని గౌరమ్మ రూపంలో కొలుచుకొని అమ్మవారిని ప్రత్యేక అలంకరణలు చేసి ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి అమ్మవారికి అనేక రకాల నైవేద్యాలను సమర్పించి వ్రతం నిర్వహించి మహిళలందరూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు శ్రీలక్ష్మీదేవి అష్ట అవతారాలలో వరలక్ష్మి ఒకరు వరాలిచ్చే తల్లి వరలక్ష్మిగా భక్తులు కొలుస్తారు వివాహమైన స్త్రీలు కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహాలు జరిగిన మహిళలందరూ దీర్ఘ సుమంగళీ గా ఉంటారని అలాగే అష్టశ్వర్యాలైన సంపద,భూమి, శిక్షణ,ప్రేమ,కీర్తి,శాంతి,సంతోషం,శక్తి వంటివి లభిస్తాయని అన్నారు ఆ జగన్మాత అమ్మవారి ఆశీర్వాదంతో భువనగిరి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఈకార్యక్రమంలో మహిళలు అనసూయ లక్ష్మి లావణ్య నాగమణి రమణ రేవతి శ్యామల సుజాత ఆదిలక్ష్మి మల్లమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది*

యాదాద్రి భువనగిరి

దేదీప్యలో ఘనంగా రాఖీ పండుగ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) స్థానిక దేదీప్య హైస్కూల్లో సుమారుగా 400 మంది విద్యార్థులతో HAPPY రాఖీ అనే అక్షరమాలను కూర్చారు రాఖీ పండుగ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు రాఖీలు కట్టించి పాఠశాలలో రాఖీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శేషగిరిరావు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల బంధం ఈ రాఖీ పండుగ అని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేషగిరి రావు, డైరెక్టర్ రంగారావు,రూప,రమ్య, శంకర్, వీరు భబిత, నరేష్,వేణు హేమలత, అనీషా, భార్గవి ,ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

నవ వధూవరులను ఆశీర్వదించిన POC కొట్టే వెంకటేశ్వర్లు!!

ఉదయగిరి:(ఆగస్టు,పున్నమి,ప్రతినిధి): ఉదయగిరి మండల ప్రధాన కార్యదర్శి కేశవ నారాయణను కలిసి నవ వధూవరులను ఆశీర్వదించి పెళ్లి కానుకగా వస్త్రములను అందచేసారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, ఉదయగిరి మండల ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, వరికుంటపాడు మండల అధ్యక్షులు రసూల్, జనసైనికులు సుంకే మల్లికార్జున, సుంకే వెంకట్,సుంకే నరేంద్ర పాల్గొన్నారు.

E-పేపర్

మూసి నది పరవళ్లు

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టుకు వరద ప్రవాహం. మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం –645 అడుగులు (4.46 టి ఎం సి. లు) ప్రస్తుత నీటిమట్టం –643 అడుగులు, (4.02 టి ఎంసి లు) ఇన్ ఫ్లో –4136.66 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో- -4734. 99క్యూసెక్కులు నాలుగు గేట్ల ద్వారా రెండు ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న మూసి ప్రాజెక్టు అధికారులు. కావున దిగువ ప్రాంత ప్రజలు జాగ్రత్త గా ఉండాలని నీటిలోకి దిగకూడదని అధికారులు తెలియజేస్తున్నారు.

అన్నమయ్య

తురక వివాహ రిసెప్షన్ హాజరై ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి

ఓబులవారిపల్లి ఆగస్టు,( పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా,ఓబులవారిపల్లె మండలం, రాళ్ళచెరువుపల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీమతి తురక రాధిక & శ్రీ తురక గోపాల్ రెడ్డి గార్ల పుత్రుడు సాయితేజ రెడ్డి మరియు తనూజ వివాహ రిసెప్షన్ రైల్వే కోడూరు,యం.జి. రోడ్డు లోని రాజ్ కన్వెన్షన్ నందు నిర్వహించబడింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు,రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లొ ఎన్డీఏ నాయుకులు పాల్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.