Tuesday, 12 May 2026

Blog

అన్నమయ్య

శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం .. ముఖ్య అతిథులుగా ముక్క సాయి వికాస్ రెడ్డి

ఓబులువారిపల్లి మండలం మంగంపేట RR5 నూతన లేఔట్‌ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లొ NDA కుటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, పాల్కొన్నారు.

అన్నమయ్య

శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం .. ముఖ్య అతిథులుగా ముక్క సాయి వికాస్ రెడ్డి

ఓబులువారిపల్లి మండలం మంగంపేట RR5 నూతన లేఔట్‌ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లొ NDA కుటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు, పాల్కొన్నారు.

అన్నమయ్య

బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ

ఓబులువారిపల్లి మండలంలోని బలిరెడ్డి పల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శుభారంభం పలికారు.బలిరెడ్డి పల్లి గ్రామానికి సిమెంట్ రోడ్ ద్వారా శాశ్వత సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రజల అభ్యున్నతి కోసం అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయి” అని తెలిపారు.గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమయానికి అందించేందుకు కృషి చేస్తాము”అని తెలిపారు.అనంతరం తిరుపతి హాస్పటల్ లొ బ్రెయిన్ స్ట్రోక్‌కు చికిత్స పొందిన గజ్జల రమణ రెడ్డి గారిని ఈరోజు వారి నివాసంలో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు,కార్యకర్తలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పోలీస్ లకు రాఖీ కట్టిన మహిళా మోర్చా నాయకులు

నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుభాషిని ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. సీఐ రోశయ్యతో పాటు సిబ్బందికి వారు రాఖీలు కట్టి స్వీట్ అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న పోలీసులకు రాఖీ కట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆడపడుచులకు పోలీసులు సోదరులు లాగా రక్షణగా ఉంటున్నారని వారు కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్

రాజరాజేశ్వరి ఆలయంలో భక్తులకు తాంబూలాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి ):వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 1,116 మంది మహిళా భక్తులకు తాంబూలాలు అందజేశారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే ఆమె ఆకాంక్షించారు.

అన్నమయ్య

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం పూజలు

హిందువులు భక్తిశ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం పూజలు మండలంలోని అన్ని గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రావణమాసంలో రెండో శుక్రవారం కావడంతో రక్షాబంధన్ కు ముందు రోజు కలసి రావడంతో హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు శక్తి కొలది ధనము, పిండి వంటలు, వివిధ రకాల పూలు పండ్లు వరలక్ష్మి దేవికి సమర్పించి ప్రతి ఇల్లు భక్తి భావంతో వెల్లివిరిసింది. సంపద సంతోషం అదృష్టం కలయికే వరలక్ష్మీ వ్రతం చేయడంలో పరమార్థంగా భావించి శక్తి కొలది ప్రతి హిందువు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరిగింది. చిట్వేల్ మండల కేంద్రంలోని శివాలయం, అమ్మవారి శాల, శ్యామలాంబిక అమ్మవారి గుడి లో కూడా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం జరిగింది. ఆలయ అర్చకులు నాగ పవన్ శర్మ, సురేంద్ర శర్మ, దేవా స్వామి, ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఈ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిట్వేల్ మండలం చుట్టుపక్కల గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఒంటిమిట్టలో మంత్రుల ప్రచారం

కడప జిల్లా: ఒంటిమిట్ట మండల ఉప జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా  రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుల ప్రచారం … ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం… పెద్ద సంఖ్యలో పాల్గొన్న టిడిపి శ్రేణులు… *ప్రత్తిపాటి పుల్లారావు* ఒంటిమిట్టలో జడ్పిటిసి గెలుపు నల్లేరు మీద నడకే… మంచిమెజారిటీతోగెలవబోతున్నాము… మా టార్గెట్ పులివెందుల గెలుపు…. అక్కడి ప్రజల్లో మార్పు మొదలైంది….

E-పేపర్

అనుమతిలేని లేని అక్రమ నిర్మాణాల కూల్చివేత

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి) : నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జేమ్స్ గార్డెన్, వెంకట్రామాపురంలో మూడు ఆసుపత్రి భవనాలను అనుమతించిన దానికంటే అదనపు అంతస్తులు నిర్మించారు. ఈ మూడు భవనాలపై ఫిర్యాదులు రావడంతో కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టి కూల్చివేత ప్రారంభించారు. మూడు భవనాలపై అదనపు అంతస్తులను గత నాలుగు రోజులుగా కూల్చి వేస్తున్నారు. శుక్రవారం కూడా కూల్చివేత పనులు కొనసాగాయి. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని టీపీఓ తెలిపారు.

తూర్పు గోదావరి

జనసేన సభ్యత్వ చెట్లు పంపిణీ దొండపూడి

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో గోపాలపురం జనసేన మండల ప్రెసిడెంట్ పోల్నాటి రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణ రాజు గారు పాల్గొని క్రియాశీల సభ్యత్వాలు చేయించుకున్న సభ్యులకు స్వయంగా వారికి అందజేయడం జరిగినది. అనంతరం జరిగిన సమావేశంలో క్రియాశీల సభ్యత్వం యొక్క ఆవశ్యకత దాని ఉపయోగాలు దొండపూడి సాగిపాడు గ్రామ జనసేన కార్యకర్తలకు ప్రజలకు వీర మహిళలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గోపాలపురం మండలం జనసేన గ్రామ అధ్యక్షులు మరియు కార్యకర్తలు మరియు జనసేన సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగినది. , గోపాలపురం మండల ప్రెసిడెంట్ కార్యక్రమానికి సహకరించిన జనసేన గ్రామ అధ్యక్షులకు మరియు కార్యకర్తలు దొండపూడి గ్రామ అధ్యక్షుడు బద్రి కడియం శ్రీను మద్దాల సన్నారై కొవ్వూరుపాడు గ్రామం రామ్ భీముల జేసుడు ఉమా అధ్యక్షుడు నరేంద్ర నూతనంగా ఎన్నికైన రాజంపాలెం అధ్యక్షుడు వెంకటేష్ రాజింపాలెం గ్రామ జనసేన సైనికులు వీర మహిళలు పోతిన గణపతి చిలక నాగేశ్వరావు గోపాలపురం మండల కార్యకర్తలు నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల మండల వ్యాప్తంగా రాఖీ పండగ సందడి

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) రాఖీ పండుగ సందర్భంగా చేజర్ల మరియు మండలంలోని ఆదురుపల్లి గ్రామంలో కొనుగోలుదారులుతో వ్యాపారం జోరుగా సాగుతోంది.గ్రామంలోని రాఖీ దుకాణాలు మరియు స్వీటు దుకాణాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రకాల రకాల రాఖీలను కొనుగోలు చేస్తున్నారు.ఐదు రూపాయల నుంచి రూ.200 వరకు వివిధ ధరల్లో,ఆకర్షణీయమైన డిజైన్లలో రాఖీలు లభ్యమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పండుగను పురస్కరించుకొని సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా రాఖీ సందడి నెలకొంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.