Sunday, 10 May 2026

Blog

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో ఇది పరిస్థితి

పున్నమి Daily న్యూస్ T.Ravinder ప్రతినిథి: ఖమ్మం ఖమ్మం జిల్లాలో ఇది పరిస్థితి * ఖమ్మం నగరం విస్తరిస్తున్న కొద్దీ గృహ సముదాయాలు తదితరాల నుంచి వెలువడే కలుషిత నీరంతా ధంసలాపురం చెరువులో కి చేరుతోంది. ఒకప్పుడు 400 ఎకరాలకు సాగు మూగజీవాలకు తాగునీరు అందించే ప్రధాన చెరువు. ఇప్పుడు మురుగు కోపంగా తయారయింది. చెరువులోకి హానికరమైన రసాయనాలు చేరడంతో మత్స్య సంపదపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే స్థానికులు ఆ దుర్గంధాన్ని భరించలేక ఇబ్బందుల పాలు అవుతున్నారు. అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకుల కేటాయింపు. మొదటి స్థానంలో మంత్రి రామానాయుడు. చివరి స్థానాల్లో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్. జాబితాలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండో స్థానంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత నాలుగో స్థానంలో హోం మంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఈ నెల 25న అల్పపీడనం.. భారీ వర్షాలు!

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-ప.బెంగాల్ తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖఫట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

E-పేపర్

మన ఊరికోసం సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు

మండలం మాధవరం-1 గ్రామానికి చెందిన మనఊరికోసం స్వచ్చంద సేవా సంస్ద సభ్యులు అవ్వారు వెంకట వరప్రసాద్ ఏ.వి.యస్.ఓ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు సతీమణి కీర్తి శేషులు అవ్వారు వెంకటలక్షుమ్మ తృతీయ వర్దంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వెంకటలక్షుమ్మ పేరు మీద ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనఊరికోసం స్వచ్చంద సేవా సంస్ద ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో పోరుమామిళ్ళ సమీపంలోని వివేకానంద వృద్దాశ్రమంలో వున్న వృద్దులకు, కొత్త మాధవరం సమీపంలోని కాశినాయన వృద్దాశ్రమంలో వృద్దులకు శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కడప ప్రకాష్ నగర్లోని సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయంలోని 105 మంది నిరుపేద, అనాధ, నిరాశ్రయ పిల్లలకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. మరియు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనఊరికోసం స్వచ్చంద సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్, ఉప్పల రామక్రిష్ణ, విష్ణు వర్దన్, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటలక్షుమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పాఠశాలల్లో ‘షుగర్ బోర్డుల’ ఏర్పాటుకు ఆదేశాలు

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @ తరగతి గదులు, ఇతర సాధారణ ప్రాంతాలలో ప్రదర్శించాలంటూ వెల్లడి. మోడల్ షుగర్ బోర్డుల చిత్రాలు విడుదల విద్యార్థుల్లో షుగర్ వినియోగంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా తాజా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు విడుదల షుగర్ బోర్డులు (లేదా చక్కెర బోర్డులు) అనేవి భారతదేశంలోని పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయబడిన దృశ్య ప్రచార బోర్డులు. సాధారణ ఆహారాలు, పానీయాలలో దాగి ఉన్న చక్కెర పరిమాణాన్ని స్పష్టంగా తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం, తద్వారా అధిక చక్కెర వినియోగం వల్ల కలిగే ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించి, ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. షుగర్ బోర్డుల లక్ష్యాలు అవగాహన పెంపు: విద్యార్థులు మరియు ఇతరులలో చక్కెర వినియోగం వల్ల కలిగే ఆరోగ్య నష్టాల గురించి అవగాహన కల్పించడం. ఆరోగ్యకరమైన అలవాట్లు: పిల్లలలో ఏర్పడే ఆహారపు అలవాట్లను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలకు ప్రోత్సహించడం. అధిక చక్కెర వినియోగాన్ని అరికట్టడం: పాఠశాలలు మరియు ఇతర సంస్థలలో అధిక చక్కెర కలిగిన ఆహార పానీయాల వినియోగాన్ని తగ్గించేలా ప్రోత్సహించడం. షుగర్ బోర్డులు ఎలా పనిచేస్తాయి? పాఠశాలలు, కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ఈ బోర్డులు, సాధారణంగా వాడే శీతల పానీయాలు, స్నాక్స్ వంటి వాటిలో ఉన్న చక్కెర పరిమాణాన్ని స్పష్టంగా చూపుతాయి. ఉదాహరణకు, ఒక సోడా బాటిల్‌లో ఎన్ని టీస్పూన్ల చక్కెర ఉంటుందో, లేదా ఇతర ప్యాక్ చేసిన ఆహారాలలో ఎంత చక్కెర దాగి ఉందో దృశ్య రూపంలో తెలియజేస్తాయి. ఇవే కాకుండా, రోజువారీ సిఫార్సు చేసిన చక్కెర పరిమితులు, అధిక చక్కెర వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, మరియు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల గురించి కూడా ఈ బోర్డులు సమాచారాన్ని అందిస్తాయి. ప్రారంభం మరియు ప్రాముఖ్యత ఈ చొరవను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పాఠశాలల్లో ప్రారంభించింది, దీనిని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సిఫార్సు చేసింది. పిల్లలలో పెరుగుతున్న ఊబకాయం, మధుమేహం, మరియు ఇతర జీవనశైలి సంబంధిత వ్యాధులను అరికట్టడానికి ఈ బోర్డులు ఒక ముఖ్యమైన సాధనంగా మారాయి.

పల్నాడు

పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో అధికారులు ఎరువుల దుకాణాలపై విస్తృత తనిఖీలు

అధికారులు ఎరువుల దుకాణలపై విస్తృత తనిఖీలు కారంపూడి , ఆగస్టు 23 (పున్నమి ప్రతినిధి) కారంపూడిలోని ఎరువుల దుకాణాలపై కారంపూడి తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు నాయక్, మండల వ్యవసాయ అధికారి పోట్ల నరసింహరావు, ఎస్సై వాసు శనివారం పలు షాపులను తనిఖీలు చేశారు. రైతులకు నిల్వలు, ధరలు సరిగా ఉన్నాయా లేవా అని వారు పరిశీలించారు. షాపుల్లోని స్టాక్ రిజిస్టర్లు, ఈపాస్ బ్యాలెన్స్‌లు సరిపోల్చారు. షాపులలో లైసెన్స్‌లు ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొని షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎరువుల డీలర్లకు పలు సూచనలు జారీ చేశారు. ఎంఆర్‌పి ధరలకే ఎరువులు, పురుగుల మందులు విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు. కాబట్టి రైతులందరికి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించాలన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

టంగుటూరి ప్రకాశం పంతులకు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన గన్నవరపు శ్రీనివాసరావు

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ కో- ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా పి.గన్నవరం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ కో- ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రేమ పూర్వకంగా నివాళులర్పిచారు.

ఆంధ్రప్రదేశ్

మాగంటి మాధవరావు భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

జలదంకి పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 23 :/// జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ కర్కోటకవారి పాలెం గ్రామ నివాసి టి సి ఎస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాగంటి మాధవ గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, వారి నివాసానికి వెళ్లి, మాగంటి మాధవరావు భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జలదంకి మండల నాయకులు మరియు గ్రామ నాయకులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

విజ్ఞానదాయకం క్షేత్రపర్యటన

విజ్ఞానదాయకం క్షేత్రపర్యటన నరసన్నపేట, ఆగస్టు 23 :విద్యార్థులకు విజ్ఞానవంతమైన ఆలోచనలకు పునాది క్షేత్రపర్యటన అని గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యన్నారాయణ అన్నారు. కళాశాల భౌతికశాస్త్ర, ఎలక్ట్రానిక్స్ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షేత్రపర్యటనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. జ్ఞానాన్ని పంచుకుంటే అది మరింతగా పెరుగుతుందని, ఇచ్చిపుచ్చుకోవడం విద్యార్థులకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయం విభాగాల ఆచార్యులతో ముఖాముఖీ కలసి శాస్త్రీయ జ్ఞానం పెంపొందించుకునే అవకాశాన్ని పొందబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డా. మార్థండ కృష్ణ, పి. రమణమూర్తి, ఎన్. హారేరామ్, కె. నందిని తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రెగ్నెన్సీ రోబో!

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో చైనా మరో అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీసింది. కృత్రిమ గర్భాశయంతో కూడిన హ్యూమనాయిడ్ ప్రెగ్నెన్సీ రోబోను 2026 నాటికి విడుదల చేయనున్నట్లు కైవా టెక్నాలజీ సంస్థ ప్రకటించి, ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రెగ్నెన్సీ రోబో అంటే ఏమిటి? ఈ ప్రెగ్నెన్సీ రోబో ఒక హ్యూమనాయిడ్ (మనిషిని పోలిన) రోబో, దీనిలో కృత్రిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ గర్భాశయం మనిషి గర్భాశయం మాదిరిగానే పనిచేస్తుంది. దీనిలో ఒక పిండాన్ని ప్రవేశపెట్టి, నవమాసాలు బిడ్డ ఎదిగేందుకు అవసరమైన పోషకాలను, వాతావరణాన్ని అందిస్తుంది. ఇది గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు మొత్తం ప్రక్రియను స్వయంచాలకంగా నిర్వహిస్తుంది. ఎందుకు ఈ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న జంటలకు ఒక కొత్త ఆశను అందిస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సరోగసి (అద్దె గర్భం) చాలా ఖర్చుతో కూడుకున్నది మరియు కొన్ని దేశాల్లో చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఈ రోబోతో ఆ సమస్యలు ఉండవు. కైవా టెక్నాలజీ ఈ రోబో ధరను సుమారు 1 లక్ష యువాన్లు (సుమారు రూ. 12 లక్షలు) ఉంటుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.