జగనన్న కాలనీలతో పేదల సొంతింటి కల నెరవేర్చాం : కాకాణి
సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలోని జగనన్న కాలనీని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. కాలనీవాసులు ఘన స్వాగతం పలుకగా, ఇళ్ల నిర్మాణాలు, ప్లాట్ల వివరాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. జగనన్న ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కల నెరవేర్చిందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మౌలిక వసతులు, గిరిజనుల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం అయితే అన్ని సదుపాయాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని కాళంగి లక్ష్మీ శ్రావ్యను సన్మానించారు.

జగనన్న కాలనీలతో పేదల సొంతింటి కల నెరవేర్చాం : కాకాణి
జగనన్న కాలనీలతో పేదల సొంతింటి కల నెరవేర్చాం : కాకాణి సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలోని జగనన్న కాలనీని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. కాలనీవాసులు ఘన స్వాగతం పలుకగా, ఇళ్ల నిర్మాణాలు, ప్లాట్ల వివరాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. జగనన్న ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కల నెరవేర్చిందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మౌలిక వసతులు, గిరిజనుల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం అయితే అన్ని సదుపాయాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని కాళంగి లక్ష్మీ శ్రావ్యను సన్మానించారు.

