Sunday, 10 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీనివాస్ కి ఎంపదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు ✨ మిత్రులు

న్యూస్ ఆగస్టు 29 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ ఐ ఎన్ ఎల్) 38 సంవత్సరాలు అచంచలమైన కృషి మరియు అంకితభావంతో సేవలందించిన తర్వాత తన విజయవంతమైన జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మా ప్రియమైన ఎం. శ్రీనివాసరావు వారి కి మా హృదయపూర్వక అభినందనలు వారి కుటుంబ సభ్యులు , బంధువులు, మిత్రులు, తెలియజేశారు ఆయనలో ప్రతిబింబించే నిజాయితీ, క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేసే స్వభావం అతని సహోద్యోగులకు మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా ప్రేరణగా నిలిచింది. బ్లాస్ట్ ఫర్నేస్ (బిఎఫ్) విభాగంలో 25 సంవత్సరాలు మరియు పైప్ ప్లాంట్ (పి పి యం ) విభాగంలో 10 సంవత్సరాలు నిరాటంకంగా సేవ చేయడం ద్వారా ఆర్ ఐ ఎన్ ఎల్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేము. ఆయన పదవీ విరమణ తర్వాత ఆయన జీవితం ఆనందం, ఆరోగ్యం, శాంతి మరియు ఆనందంతో నిండి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆయన కొత్త జీవిత ప్రయాణంలో ప్రతి రోజు కొత్త ఉత్సాహాన్ని, మరియు అపారమైన ఆనందాన్ని తెస్తుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాలెం తాతారావుకు భీమ్ రత్న అవార్డు

జాలెం తాతారావుకు ప్రతిష్టాత్మకమైన భీమ్ రత్న అవార్డు ప్రధానం చేసిన దళిత చైతన్య వేదిక ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ రాజోలు ప్రముఖ అంబేడ్కరీయులు, సామాజిక వివాహాల సంధానకర్త జాలెం తాతారావుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దళిత చైతన్య వేదిక ప్రతిష్టాత్మకమైన భీమ్ రత్న అవార్డును ప్రదానం చేసింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు అధ్యక్షతన జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను కలసి కరాచలనం చేసి, అంబేడ్కర్ అంత్యక్రీయాల్లో పాల్గొన్న జాలెం తాతారావుకు దళిత చైతన్య వేదిక భీమ్ రత్న అవార్డు ప్రదానం చేయ్యడం సముచితమైన విషయమన్నారు. 500 లకు పైగా సామాజిక వివాహాలు చేసి, బీవీ రమణయ్య ఉద్యమ బాటలో ముందుకు సాగిన జాలెం తాతారావు నేటి సమాజానికి ఆదర్శప్రాయుడన్నారు. అనంతరం నాయకులు హర్షధ్వానాలు చేస్తుండగా జై భీమ్ నినాదాలు హోరెత్తుతుండగా దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు లు భీమ్ రత్న అవార్డును జాలెం తాతారావుకు ప్రదానం చేశారు. మట్టా సురేష్ అవార్డు సత్కారా పత్రాన్ని చదువుతుండగా వేదిక సభ్యులైన చిలకపాటి శ్రీధర్, లిఖితపూడి బుజ్జి, మందపాటి మధు, బొడ్డపల్లి పుల్లయ్య, దీపాటి శివప్రసాద్ మెడబల శ్యాం శేఖర్, పొన్నమాటి భాస్కర్, కాకర విశ్వనాధం, ఉప్పే జగదీష్ లు శాలువా, పూలమలతో సత్కరించి తలపై నీలి కీర్తి కిరీటాన్ని అలంకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాలెం సుబ్బారావు, ఉమాపార్వతీ దంపతులు, జాలెం రాంబాబు, జాలెం భీమారావు, జాలెం సుస్మా, సర్పంచ్ లు జాలెం రమణకుమారి, గెడ్డం వెంకటేశ్వరరావు, బళ్ళ శ్రీనివాస్, తాళ్ళ నాగరాజు, అడబాల తాతకాపు, ఎంపీటీసీల సమైక్య అధ్యక్షులు నెల్లి దుర్గాప్రసాద్ నాయకులు కలిగితి పళ్ళం రాజు, ముకరం హుస్సేన్, విప్పర్తి సాయిబాబు, నీతిపూడి చంద్రరావు, భూపతి వెంకటపతి, చింతా రాజబాబు, గెడ్డం ఫిలిప్ రాజు, కొల్లాబత్తుల అశోక్, గెడ్డం తులసీ భాస్కర్, తోటే ప్రతాప్, నీతిపూడి మహేష్, బత్తుల శ్రీను, కోళ్ళ సురేష్, రాయుడు శ్రీనివాస్, జాలెం రాజేష్,జేటి ఫ్రెండ్స్ సర్కిల్, రాయుడు నాగేశ్వరరావు, కడలి సత్యనారాయణ, మొల్లేటి శ్రీనివాస్, విప్పర్తి గణపతి రావు, మొల్లేటి పార్వతీ, కొల్లాబత్తుల చిన్ని, అనుకుల కుమార్, విజయ కుమారి, బత్తుల వెంకటరమణ, బత్తుల రాంబాబు, పున్నం ప్రసాద్, బళ్ళ రాంబాబు, పొన్నమండ వెంకటేశ్వరరావు, వానరసి ప్రసాద్, కడలి బాబూరావు, తాటికాయల్ ఉదయ్ భాస్కర్, అడబాల అబ్బులు, కల్మి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ విశాఖపట్నం విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్ సమస్యలు విన్నవించేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ విజ్ఞప్తులు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ విశాఖపట్నం : వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. శుక్రవారం ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్..వారి వినతులను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. వాడబలిజ మత్స్సకారులకు ఆసరాగా నిలవండి ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని వాడబలిజ మత్స్యకారులమైన తాము అరకొర సంపాదనతో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని.. తమకు బోట్లు, వలలు అందించడంతో పాటు మా ప్రాంతాల్లో పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఉత్తరాంధ్ర వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన తనకు ఉద్యోగం కల్పించడంతో పాటు నివాస స్థలం మంజూరు చేయాలని విశాఖ మిండి ప్రాంతానికి చెందిన దాడి అవినాష్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తన తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందారని, ఎలాంటి ఆధారం లేని తనను ఆదుకోవాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర పోలీసు వారి నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక నవరాత్రుల ఉత్సవాలలో ఊరేగింపు కార్యక్రమంలో సౌండ్ సిస్టమ్స్ ను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర ఈవెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 5వేల కుటుంబాలు ఉత్సవాలపై ఆధారపడి ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సర్వస్వం కోల్పోయిన తమకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన గుడాల జీవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గత నెల 11వ తేదీన విశాఖపట్నం వెళ్తుండగా తాము ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో తాను, తన సతీమణి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డామని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ కుమారుడు మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. డిగ్రీ చదివిన తమ దివ్యాంగ కుమార్తెకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విశాఖపట్నం 91వ వార్డుకు చెందిన పి.ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. విశాఖ భీమిలి మండలం లక్ష్మీపురంలో ఉన్న తన స్థలంలో నూతన ఇల్లు నిర్మించుకునేందుకు కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ అడ్డుగా ఉందని, సదరు ట్రాన్స్ ఫార్మర్ ను తొలగించి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలోకి మార్పించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కె.సత్తిబాబు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలపై మూడంచెల్లో పర్యవేక్షణ

2,778 పోస్టులు మంజూరు ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి@ అమరావతి : ఏపీలోని గ్రామ/వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేం దుకు శ్రీకారం చుట్టిన గ్రామ/వార్డు సచివాలయాల శాఖ.. తాజాగా మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. డిప్యుటేషన్ / ఔట్సోర్సింగ్ ద్వారా 2,778 పోస్టులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా మండలాలు/పట్టణ స్థానిక సంస్థల నుంచి 1,785 మందిని డిప్యుటేషన్పై వినియోగించుకోనున్నారు. 993 కొత్త ఏఎన్ఎం / వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు. నియామకాలు.. పర్యవేక్షణ ఇలా గ్రామ/వార్డు సచివాలయాల శాఖ నుంచి ఆరుగురిని, డైరెక్టరేట్ నుంచి ఆరు గురిని డిప్యుటేషన్పై ఫంక్షనల్ అసిస్టెంట్లుగా తీసుకుంటారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి 17 మంది జాయింట్ డైరెక్టర్/ డీఎల్డీఏ స్థాయి అధికారులను జిల్లా గ్రామ/ వార్డు సచివాలయ శాఖ అధి కారిగా నియమిస్తారు. ఆ శాఖల నుంచి 26 మంది సూపరింటెండెంట్లు, 26 మంది సీనియర్ అసిస్టెంట్లు, 52 మంది టెక్నికల్ కోఆర్డినేటర్లు, 104 మంది జూనియర్ అసిస్టెంట్లను డిప్యుటేషన్పై తీసుకుంటారు. 26 మంది ఆఫీసు సబార్డినేట్లను ఔట్సోర్సింగ్ ద్వారా నియమిస్తారు. మండల స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవల్ గెజిటెడ్ అధికారిని మండల గ్రామ/వార్డు సచివాలయ అధికారిగా నియమిస్తారు. ఇందుకోసం 660 మందిని డిప్యుటేషన్పై తీసుకుంటారు. మండలాల్లో 1,320 మంది జూనియర్ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యుటేషన్పై నియమిస్తారు. అదే విధంగా పురపాలక శాఖకు చెందిన ఇద్దరు రీజినల్ డైరెక్టర్ కమ్ అప్పిలేట్ కమిషనర్లు, ఆరుగురు సెలక్షన్ గ్రేడ్ /జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను అదనపు కమీషనర్లగా,మరో 9 మంది జిల్లా గ్రామ/ వార్డు సచివాలయ శాఖ అధికారులుగా డిప్యుటేషన్ పై నియమిస్తారు.

క్రైమ్

జీహెచ్ఎంసీలో క్రమక్రమంగా బయటపడుతున్న అవినీతి బాగోతాలు

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ రూ.56 లక్షల జీహెచ్ఎంసీ నిధులు కాజేసిన మహిళా కంప్యూటర్ ఆపరేటర్ జీహెచ్ఎంసీలో క్రమక్రమంగా బయటపడుతున్న అవినీతి బాగోతాలు శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌర సేవ కేంద్రాల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సుభాషిణి అనే మహిళ ట్రేడ్ లైసెన్స్, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తుల స్వీకరణ వంటి పనులకు ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేయలేదని తేల్చిన ఆడిటర్లు 2024–25 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు రూ.56 లక్షలు కాజేసినట్టు నిర్ధారించిన ఆడిట్ అధికారులు ఆడిట్ జరుగుతుందని తెలిసి విధులకు హాజరు కాకపోవడంతో, ఆమెను బలవంతంగా కార్యాలయానికి రప్పించిన ఉన్నతాధికారులు నిధులు కాజేసినట్టు అంగీకరించి, కేవలం ఒక్క రోజులోనే జీహెచ్ఎంసీ ఖాతాలో రూ.56 లక్షలు జమ చేసిన మహిళా ఆపరేటర్ సుభాషిణి

ఆంధ్రప్రదేశ్

ఫ్యామిలీ కార్డు అంటే ఏమిటో తెలుసా.?

ఆగస్టు 29పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ కార్డు అనేది ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డు మాదిరిగానే ఉన్నా, ఒక కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యుల వివరాలు, వారి అవసరాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్థితి వంటి అంశాలన్నీ ఇందులో నమోదు చేయబడతాయి. ఈ డిజిటల్ డేటాబేస్ ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి, మెరుగైన సేవలను అందించడం ప్రభుత్వ లక్ష్యం.

గూడూరు

శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 2

చిట్టమూరు మండలం మల్లా లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 2 నుండి రంగ రంగ వైభవంగా జరుగును ఉన్నాయని బ్రహ్మోత్సవాలకు రావాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు తమ కోరికలను తీర్చుకొని స్వామి అమ్మవాళ్ళ దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇష్టమూరు మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు మరియు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో మరోసారి హై టెన్షన్ వాతావరణం, వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు…

నెల్లూరు జిల్లాలో మరోసారి రాజకీయంగా టెన్షన్ వాతావరణ నెలకొంది, కావలి నియోజకవర్గం అన్నవరం సమీపంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి సంబంధించిన గురు రాఘవేంద్ర క్వారీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి అంటూ వైసిపి పార్టీ నేతలు ఛలో అన్నవరం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు,ఈ నేపద్యంలో వైసిపి నేతలు కావలికి వెళితే గొడవలు జరిగే అవకాశం ఉందనే కారణంగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ని,ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లతో పాటు పలువురు ప్రముఖ వైసిపి నేతలను ఈరోజు ఉదయం ఇంటి నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు…

క్రైమ్

ఏసీబీ కోర్టు సంచలన తీర్పు… లంచం తీసుకున్న ఎస్సై‌కు ఏడేళ్ల జైలు శిక్ష

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త మంగరాజు, అతని తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల పై వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్‌లో పెద్దయ్య 2015లో ఎస్సైగా పని చేస్తున్న సమయంలో సదరు మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో మంగరాజు, అతని కుటుంబ సభ్యులపై వరకట్నం నిషేధం చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా ఎస్సై తాత్సారం చేశారు. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మంగరాజు నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.

ఖమ్మం

కల్లుగీతసొసైటీలు, టిఎఫ్ టి గ్రామాలకే మద్యం షాపులలో రిజర్వేషన్స్ కల్పించాలి

*కల్లుగీతసొసైటీలు, టిఎఫ్ టి గ్రామాలకే మద్యం షాపులలో రిజర్వేషన్స్ కల్పించాలి..* *ఇచ్చిన మాట ప్రకారం 25% ఇవ్వాలి* *ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలి* రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గౌడులకు 15% రిజర్వేషన్స్ కల్పిస్తూ తెచ్చిన మద్యం పాలసీ వల్ల గీత కార్మికులకు ప్రయోజనమేమీ లేదని, సొసైటీ, టిఎఫ్ టి గ్రామాలకు ఇవ్వాలని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్రఅధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాంనగర్ లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. మద్యం షాపులలో రిజర్వేషన్స్ పెంచితే ప్రభుత్వానికి లాభం తప్ప నష్టం ఉండదన్నారు. మద్యం షాపుల టెండర్లలో గౌడులకు 15%, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్స్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. *కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గౌడులకు 25 శాతం పెంచుతామని చెప్పిందని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.* మద్యం వల్ల కల్లుగీత వృత్తి దెబ్బ తింటుందని గత టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవతో మద్యం షాపుల లో గౌడులకు 15% రిజర్వేషన్స్ కల్పించారు. ఫలితంగా 392 మంది ఆ.. అవకాశాన్ని ఉపయోగించుకున్నారని, కానీ దీని వల్ల ఇచ్చిన ఉద్దేశం నెరవేర లేదన్నారు. కల్లుగీత సొసైటీలకు,TFT గ్రామాలకు ఇచ్చినట్లయితే ఆర్థికంగా గీత కార్మికులకు ఉపయోగం జరుగుతుందన్నారు. అందుకని ప్రభుత్వం పునరాలోచించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వెంకటరమణ కోరారు. *బేవరేజెస్, డిస్టలరీస్, బాటిలింగ్ తదితర మద్యం ఉత్పత్తి రంగంలో కూడా రిజర్వేషన్స్ కల్పిస్తే సొసైటీలు బలోపేతం అవుతాయని గీత కార్మికులకు ఉపాధి కలుగుతుందన్నారు.* ఈ..సమావేశంలో రాష్ట్రప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు, గౌని వెంకన్న, వెంకటనర్సయ్య, బాల్నే వెంకటమల్లయ్య, పామనగుండ్ల అచ్చాలు, రాష్ట్ర కార్యదర్శులు చౌగాని సీతారాములు, బూడిద గోపి, ఎస్ రమేష్ గౌడ్, బండకింది అరుణ్, మడ్డి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.