Thursday, 7 May 2026

Blog

సినిమా

పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్ ” గా వస్తున్నాడు.

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @ సినిమా: గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్. స్టైలిష్ లుక్ లో అదిరిపోయిన పవర్ స్టార్ లుక్. DSP మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

E-పేపర్

చంద్రన్న @30 – మూడు దశాబ్దాల సేవ, సంస్కరణల పయనం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్

చంద్రన్న @30 – మూడు దశాబ్దాల సేవ, సంస్కరణల పయనం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ — “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి సిఎం‌గా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన ఈ ప్రత్యేక సందర్భం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక గర్వకారణమని ఆయన పాలనలో రాష్ట్రానికి దిశా నిర్ధేశం జరిగి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది పడింది.ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం, సంక్షేమ పథకాల విస్తరణ, ఐటీ విప్లవానికి శ్రీకారం, విద్యా–వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు, వ్యవసాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడం వంటి 30 కీలక పథకాల ద్వారా చంద్రన్న గారు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. ‘జన్మభూమి, దీపం, డ్వాక్రా, ఆదరణ, అన్నా క్యాంటీన్, రైతులకు ఇజ్రాయిల్ టెక్నాలజీ ద్వారా ఆధునిక సాగు, నదుల అనుసంధానం, రియల్ టైం గవర్నెన్స్, అమరావతి రాజధాని’ వంటి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు ఆయన ముందుచూపుకు నిదర్శనం. నేటి యువతకు, రాబోయే తరాలకు చంద్రన్న ఒక ప్రేరణాస్ఫూర్తి. ఆయన నాయకత్వం వల్లే తెలుగుదేశం పార్టీ పేదల నుంచి మేధావుల వరకు అందరి గుండెల్లో స్థానం సంపాదించుకుందని రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ, ఆచరణలో పెట్టే నాయకుడిగా చంద్రబాబు నిలిచారు. ఆయన 30 ఏళ్ల ప్రజాసేవకు, రాష్ట్ర అభివృద్ధి పయనానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను” అని నవీన్ తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆలమూరు సబ్ రిజిస్టార్ పై ఏసీబీ దాడులు* *లంచం తీసుకుంటూ పట్టు పడ్డారు*

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా రూ.28వేలు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి.. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యం కు చెందిన ఎకరా 36 సెంట్లు భూమిని తన కుమారుడుకి రిజిస్ట్రేషన్‌ చేయడానికి రూ. 50 వేలు లంచం అడిగారని చివరకు రూ.28 వేలకు ఒప్పుకున్నారని రైతు పిర్యాదు చేయడంతో ఏసీబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అంతేగాక మరో 35 వేల రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్, కార్ డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నట్లు ఎసిబీ డి.ఎస్.పి కిషోర్ కుమార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

గోదావరిలో పడిన యువకుడిని రక్షించిన పోలీసులు

వినాయక నిమజ్జన సమయంలో గోదావరిలో ప్రమాదవశాత్తు పడిన యువకుడిని అమలాపురం పోలీసులు చాకచక్యంగా రక్షించారు.పేరూరు గ్రామంలోని పల్లపు వీధి (రాజ్యలక్ష్మి గుడి వద్ద) దూడల సత్యమూర్తి కమిటీకి చెందిన వినాయక విగ్రహాన్ని సోమవారం రాత్రి పాసర్లపూడి బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి 09:15 ని.ల సమయంలో నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడికుదురు మండలం, పాసర్లపూడి గ్రామంలోని బ్రిడ్జి కింద గోదావరి నదిలో కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు కలసి నిమజ్జనం చేసే సందర్భంలో పేరూరు గ్రామం దూడల వారి వీధికి చెందిన చిలుకూరి చిన సాయి కృష్ణ అనే యువకుడు నీటిలో పడి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నదిలో కట్టిన తాడును పట్టుకుని ప్రాణాలను నిలుపుకున్నా, మధ్యలో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మట్టపర్తి రాంబాబు, కానిస్టేబుల్ రాయుడు వి.వి. శ్రీనివాసరావు వెంటనే స్పందించి మత్స్యకారులను సహాయానికి పిలిపించారు. పడవ సాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.పోలీసులు అప్రమత్తంగా లేకపోతే యువకుడు గల్లంతయ్యే ప్రమాదం తప్పదని గ్రామస్తులు పేర్కొన్నారు.

తిరుపతి

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అధునాతన అంబులెన్స్

ఈ రోజు శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కు ప్రభుత్వం అధునాతన అంబులెన్స్ ను మంజూరు చేసినది.ఈ అంబులెన్సు ను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు.అంబులెన్సు మంజూరు కి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు చూపిన చొరవ అభినందనీయమని తెలిపిన హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది మరియు కమిటి సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

గణపతి హోమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు కోలా ఆనంద కుమార్ ఆధ్వర్యంలో జరిగిన గణపతి హోమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పాల్గొని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గణపతి హోమంలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.అనంతరం కోలా ఆనంద్,వారి మిత్ర బృందంచే ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు టిడిపి నాయకులు గోగినేని భాస్కర్ నాయుడు, సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రేబిస్ ప్రాణాంతకం.! చికిత్స లేదు…

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి@రేబిస్ ప్రాణాంతకం కుక్క , పిల్లి, కోతి లాంటి జంతువులు కరిచినా చర్మంపై కోసుకొనేట్టు గోకినా వెంటనే వాక్సిన్ వేయించుకోండి . బాగా లోతుగా కరిస్తే రేబిస్ ఇమ్మ్యూనోగ్లోబిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి . ఎమీ కాదులే అనుకోవద్దు . వ్యాధి లక్షణాలు వచ్చే వరకు వేచి చూడొద్దు . ఒక్క సారి లక్షణాలు కనిపిస్తే మరణం ఖాయం .. అదీ అతి భయంకరమయిన చావు . కరిచిన వెంటనే వాక్సిన్ ఒక్కటే మార్గం . అన్ని వాక్సిన్ లు ఒక్కటి కాదు . రేబిస్ వాక్సిన్ నిజమయిన వాక్సిన్ ..

తిరుపతి

శ్రీ కాళహస్తి లో ట్రాఫిక్ సమస్య

శ్రీకాళహస్తిలో నిరంతరం ట్రాఫిక్ సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.బస్టాండ్,ఆలయ పరిసరాలు,ప్రధాన వీధుల్లో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలును పాటించకపోవడం వలన రద్దీ అధికమౌతున్నది.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యతో పాదచారులు,ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్

*CBI పెండింగ్ కేసులు ఎన్నంటే*..?

పున్నమి ప్రతి నిధి కేంద్ర దర్యాప్తు సంస్థ( CBI) పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్లో ఉందని కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. దీనిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉండటం గమనార్హం. విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. గతేడాది డిసెంబరు 31 నాటికి 1,506 కేసులు మూడేళ్లలోపు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఎంతగానో ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది

క్రైమ్

మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి.

సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @మీపై కేసు: చైనా ముఠాలు కంబోడియా, లావోస్, మయన్మార్లతో కూడిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’ ప్రాంతంలో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయి. భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీవోఐపీ)లతో కూడిన ‘సిమ్బాక్స్’ సెటప్లను అక్రమంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ఈ సెటప్ ల ద్వారా లోకల్ కాల్స్ గా మార్చుతూ.. సీబీఐ, ఈడీ, ముంబయి పోలీస్ తదితర దర్యాప్తు సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నట్లు.. మీపై కేసు నమోదైనట్లు, డిజిటల్ అరెస్ట్ చేసినట్లు బెదిరిస్తున్నాయి. చర్యలు తీసుకోకుండా ఉండాలంటే.. వెంటనే రూ. లక్షలు పంపండి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. పెట్టుబడులపై అధిక లాభాల పేరుతోనూ సైబర్ మోసగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. ఈ మోసాలన్నీ విదేశాల నుంచే జరుగుతున్నాయి. ఇలా మీ సెల్ ఫోన్ కు భారత్ నంబర్ తోనే అంతర్జాతీయ కాల్స్ వస్తుంటే.. అవి ముమ్మాటికీ సైబర్ నేరస్థుల పనేనని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) స్పష్టం చేస్తోంది. అలాంటప్పుడు వెంటనే ‘రిక్విన్ (రిపోర్ట్ ఇన్ కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్)’కు ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. ఎలా గుర్తించాలి..? గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి వచ్చే ఫోన్ కాల్ సెల్ ఫోన్ స్క్రీన్ పై ‘అన్ నోన్ నంబర్’ అని కనిపిస్తుంది. లేదా +91తో ప్రారంభమై అదనంగా పదంకెల నంబర్ ఉంటుంది. దీనిపై www.sancharsaathi.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి ‘సిటిజెన్ సెంట్రిక్ సర్వీసెస్’లోని ‘రిక్విన్’ ఆప్షన్ను ఎంచుకొని వివరాలు నమోదు చేయొచ్చు. 1963/1800110420 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీవోటీ స్పష్టం చేస్తోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.