నంద్యాల : ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన పిలుపులో భాగంగా నంద్యాల జిల్లాలో మూడో రోజు కూడా నిరసనలు హోరెత్తాయి. పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ‘హ్యాండ్ టు హ్యాండ్’ ప్రచారం నిర్వహిస్తూ ఉద్యమ కార్యాచరణను వివరించారు.అనంతరం నంద్యాల కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల (RDO) వద్ద ఉద్యోగులు భారీ ఎత్తున ‘లంచ్ అవర్’ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తేలేంత వరకు శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతిలో ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఏపీజేఏసీ సంఘ నాయకులు స్పష్టం చేశారు.

మూడో రోజుకు చేరిన ఉద్యోగుల నిరసన.. కలెక్టరేట్ వద్ద ‘లంచ్ అవర్’ ధర్నా
నంద్యాల : ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన పిలుపులో భాగంగా నంద్యాల జిల్లాలో మూడో రోజు కూడా నిరసనలు హోరెత్తాయి. పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ‘హ్యాండ్ టు హ్యాండ్’ ప్రచారం నిర్వహిస్తూ ఉద్యమ కార్యాచరణను వివరించారు.అనంతరం నంద్యాల కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల (RDO) వద్ద ఉద్యోగులు భారీ ఎత్తున ‘లంచ్ అవర్’ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తేలేంత వరకు శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతిలో ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఏపీజేఏసీ సంఘ నాయకులు స్పష్టం చేశారు.

