రాజన్న సిరిసిల్ల ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిని మండల నాయకులు ఘనంగా ఆహ్వానించి సన్మానించారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏనుగు తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఏద్దండి నర్సింహారెడ్డి పాల్గొన్నారు. సీనియర్ నాయకులు చెవుల మల్లేశం, నల్ల నర్సయ్య, శీలం స్వామి, ఎండీ నవాజ్, గూడూరి భరత్, ప్రశాంత్, గొండయ్య, తాళ్ల రాజు తదితరులు పాల్గొని జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.


