Saturday, 5 September 2026
  • Home  
  • రాయలసీమ నీటి హక్కులపై మౌనం ఎందుకు?: బొజ్జా దశరథరామిరెడ్డి ప్రశ్నాస్త్రం
- నంద్యాల

రాయలసీమ నీటి హక్కులపై మౌనం ఎందుకు?: బొజ్జా దశరథరామిరెడ్డి ప్రశ్నాస్త్రం

నంద్యాల : శ్రీశైలం జలాశయంలో క్యారీ ఓవర్ నీటిని నిల్వ చేయకుండా కేవలం 39.26 టీఎంసీలకే పరిమితం చేయడంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది సమృద్ధిగా కృష్ణా జలాలు వచ్చినప్పటికీ నిల్వ చేయకపోవడం వల్ల ప్రస్తుతం రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.విద్యుత్ ఉత్పత్తి నెపంతో శ్రీశైలం నీటిని నాగార్జున సాగర్‌కు తరలిస్తూ, రాయలసీమ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడం సరికాదని, నీరు రాయలసీమ ప్రజల హక్కు అని తేల్చి చెప్పారు. ఎల్‌నినోను సాకుగా చూపకుండా జలాశయ విధివిధానాలను అమలు చేసి, సీమలోని ప్రాజెక్టులు, ఆయకట్టు, చెరువులు, కుంటలకు వెంటనే నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నంద్యాల : శ్రీశైలం జలాశయంలో క్యారీ ఓవర్ నీటిని నిల్వ చేయకుండా కేవలం 39.26 టీఎంసీలకే పరిమితం చేయడంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది సమృద్ధిగా కృష్ణా జలాలు వచ్చినప్పటికీ నిల్వ చేయకపోవడం వల్ల ప్రస్తుతం రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.విద్యుత్ ఉత్పత్తి నెపంతో శ్రీశైలం నీటిని నాగార్జున సాగర్‌కు తరలిస్తూ, రాయలసీమ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడం సరికాదని, నీరు రాయలసీమ ప్రజల హక్కు అని తేల్చి చెప్పారు. ఎల్‌నినోను సాకుగా చూపకుండా జలాశయ విధివిధానాలను అమలు చేసి, సీమలోని ప్రాజెక్టులు, ఆయకట్టు, చెరువులు, కుంటలకు వెంటనే నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.