ఖమ్మం, ఆగష్టు
(పున్నమి న్యూస్)
మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మోటుమర్రి గ్రామానికి చెందిన దివంగత చనుమోలు శంకరయ్య సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కాపురం జిల్లా కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్ హాజరై శంకరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శంకరయ్య సమాజానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.



