నంద్యాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలో ఈ నెల 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న తెలిపారు. శనివారం ఉదయం 7.30 గంటలకు జరిగే వేడుకల్లో జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ జి. రాజకుమారి గణియా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పురపాలక సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు. కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.



