అనకాపల్లి జిల్లా : ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
యలమంచిలి నియోజకవర్గం, పేట బయ్యవరం:
పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవర్గంలోని పేట బయ్యవరం గ్రామం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
ఎలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎడ్ల చినబాబు, మాజీ వైస్ ఎంపీపీ గొన్నబోతుల శేషు, మాజీ సర్పంచ్ గంజి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మగ్గా బాబురావు, పులపర్తి నీటి సంఘం వైస్ చైర్మన్ ఎడ్ల కాంతారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు, తెలుగుదేశం పార్టీ ఆడపడుచులు కార్యక్రమానికి బయలుదేరారు.
పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు సాగునీటి పరంగా మరింత ప్రయోజనం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


