పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
బిక్కవోలు, సెప్టెంబరు 2 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు గ్రామంలోని స్మశానవాటికలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగరాపు రామారావు, గొర్రెల త్రిమూర్తులు మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు సూచించారు.
స్మశానవాటిక పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించి, వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.




