నంద్యాల:నంద్యాల పట్టణంలోని 8వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె. కళ్యాణి బాయి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా సచివాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ మరియు ప్రజలకు అందుతున్న వివిధ రకాల సేవల పురోగతిని ఆమె సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ… సచివాలయానికి ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీతో సచివాలయ సిబ్బందిలో అప్రమత్తత పెరిగింది.

8వ వార్డు సచివాలయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
నంద్యాల:నంద్యాల పట్టణంలోని 8వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె. కళ్యాణి బాయి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా సచివాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ మరియు ప్రజలకు అందుతున్న వివిధ రకాల సేవల పురోగతిని ఆమె సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ… సచివాలయానికి ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీతో సచివాలయ సిబ్బందిలో అప్రమత్తత పెరిగింది.

