Friday, 28 August 2026
  • Home  
  • కలెక్టర్ కు రాఖీ కట్టిన విజ్ఞాన భారతి విద్యార్థునులు
- విజయనగరం 

కలెక్టర్ కు రాఖీ కట్టిన విజ్ఞాన భారతి విద్యార్థునులు

*కలెక్టర్‌కు రాఖీ కట్టిన విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థినులు* విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 28. ( పున్నమి ప్రతినిధి ) రాఖీ పండుగను పురస్కరించుకుని స్థానిక విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థినులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్. రాంసుందర్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు విద్యార్థినులు రాఖీలు కట్టి, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడి, వారి విద్యాభ్యాసం, పాఠశాలలోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చూపిన ఆప్యాయతకు కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

*కలెక్టర్‌కు రాఖీ కట్టిన విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థినులు*

విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 28. ( పున్నమి ప్రతినిధి )

రాఖీ పండుగను పురస్కరించుకుని స్థానిక విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థినులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్. రాంసుందర్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు విద్యార్థినులు రాఖీలు కట్టి, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థినులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడి, వారి విద్యాభ్యాసం, పాఠశాలలోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు చూపిన ఆప్యాయతకు కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.