*విశాఖపట్నం, ఆగస్టు 27:* రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి విశాఖ విచ్చేశారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకున్న మంత్రికి డీసీసీబీ చైర్మన్ కొణతాతారావు తో పాటు ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్ రాజు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వివాహ వేడుకలో డీసీసీబీ చైర్మన్ కొణతాతారావు మంత్రి లోకేష్ తో కలిసి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మంత్రితో కలిసి దిగిన ఫోటోలో డీసీసీబీ చైర్మన్ కొణతాతారావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


