మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా నకిలీ వరి విత్తనాలు రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును కోటపల్లి పోలీసులు రట్టు చేశారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. ఎలాంటి అనుమతులు, బిల్లులు లేకుండా లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 30.7 టన్నుల వరి విత్తనాలను అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు.


