సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువతతో పాటు ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి సూచించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సైబర్ జాగృతా దివాస్ నిర్వహించారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ, కేవైసీ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దన్నారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్లపై క్లిక్ చేయరాదన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని, ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీకి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు మోహన్ బాబు, కరుణాకర్, బాలకృష్ణ, ఉస్మాన్ షరీఫ్, ప్రిన్సిపాల్ బానోత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సైబర్ మోసాలపై అప్రమత్తతే రక్షణ: టౌన్ ఏసీపీ రమణమూర్తి
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువతతో పాటు ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి సూచించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సైబర్ జాగృతా దివాస్ నిర్వహించారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ, కేవైసీ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దన్నారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్లపై క్లిక్ చేయరాదన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని, ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీకి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు మోహన్ బాబు, కరుణాకర్, బాలకృష్ణ, ఉస్మాన్ షరీఫ్, ప్రిన్సిపాల్ బానోత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

