నర్సంపేట నియోజకవర్గం ,ఖానాపూర్ మండలం, మంగళ వారి పేట గ్రామంలో, జరిగిన గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ .
వి.బి .జి .రామ్.జి ఉపాధి పనుల పై గ్రామసభ వీబీ జీ రామ్ జీ పథకం 2027-2028 కూలీలకు పనులు గుర్తించడం కొరకు ఈ రోజు మంగళవారిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఎల్.ని.నో ప్రభావంతో వర్షాలు లేవు కాబట్టి కూలీలు, రైతులు అధిక సంఖ్యలో పనులు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూషబోయిన రాజు ,వార్డు మెంబర్ గొంది నరసయ్య, టెక్నికల్ అసిస్టెంట్ వీరబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ పులిగిల్ల శ్రీశైలం, మక్కా వెంకన్న, ననబోయిన రమేష్,ఎద్దు మహేష్,చెన్నబోయిన వీరన్న మరియు కూలీలు ,రైతులు పాల్గొన్నారు.



