తిమ్మరాజుపేట (ఎస్.రాయవరం), ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
తిమ్మరాజుపేట KGBV పాఠశాలలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి ఎన్.సూర్యలక్ష్మి మాట్లాడుతూ 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్య అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. లింగ వివక్షకు తావులేకుండా నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పిల్లల హక్కులకు భంగం కలిగితే చైల్డ్లైన్ 1098, మహిళలు, బాలికల సమస్యలకు 181 ఉచిత నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.


