ఉదయగిరి మండల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భూసార పరీక్షల ప్రాధాన్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు డీఆర్సీ నుంచి వచ్చిన వ్యవసాయ అధికారి మధురిమ భూమిలో లభించే పోషకాలు, భూసార పరీక్షలు నిర్వహించే విధానం, పంటల దిగుబడిని పెంచడంలో వాటి పాత్రను విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జి. శ్రీనివాసరావు, ఎంఈపీఓ తనూజ, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం
ఉదయగిరి మండల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భూసార పరీక్షల ప్రాధాన్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు డీఆర్సీ నుంచి వచ్చిన వ్యవసాయ అధికారి మధురిమ భూమిలో లభించే పోషకాలు, భూసార పరీక్షలు నిర్వహించే విధానం, పంటల దిగుబడిని పెంచడంలో వాటి పాత్రను విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జి. శ్రీనివాసరావు, ఎంఈపీఓ తనూజ, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

