నంద్యాల: శారదా విద్యాపీఠం పాఠశాలలో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు సౌజన్యంతో తెలుగు భాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా గిడుగు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, ప్రముఖ సాహితీవేత్త రమణమూర్తి, తెలుగు ఉపాధ్యాయులు వెంకటకృష్ణలకు ‘లయన్స్ క్లబ్ తెలుగు భాషా దినోత్సవ పురస్కారాలు’ అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మేడా చంద్రశేఖర్, నిజాముద్దీన్, సోమేశుల నాగరాజు, కిరణ్ లాల్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
నంద్యాల: శారదా విద్యాపీఠం పాఠశాలలో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు సౌజన్యంతో తెలుగు భాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా గిడుగు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, ప్రముఖ సాహితీవేత్త రమణమూర్తి, తెలుగు ఉపాధ్యాయులు వెంకటకృష్ణలకు ‘లయన్స్ క్లబ్ తెలుగు భాషా దినోత్సవ పురస్కారాలు’ అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మేడా చంద్రశేఖర్, నిజాముద్దీన్, సోమేశుల నాగరాజు, కిరణ్ లాల్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

