Sunday, 16 August 2026

Tag: Award

నంద్యాల

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహానికి గోళ్ళ రాజేష్ ఘన నివాళి

నంద్యాల.: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నంద్యాల

మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి కు ఉత్తమ సేవా ప్రశంసా పత్రం

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహానంది మండలంలో విశిష్ట సేవలు అందించిన మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి ఉత్తమ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో కనబరిచిన అంకిత భావానికి గుర్తింపుగా శనివారం రాష్ట్రమంత్రి ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి,ఎస్పీ సునిల్ షోరాణ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఎస్సై రామ్మోహన్ రెడ్డిని పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అభినందించారు.

నంద్యాల

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహేష్ గౌడ్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు

నంద్యాల : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నంద్యాల మున్సిపాలిటీ వాటర్ సెక్షన్‌లో ఫిల్టర్ బెడ్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్ గౌడ్ ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు.జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలు అందించడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఆయనను ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. అవార్డు అందుకున్న మహేష్ గౌడ్‌ను సహచర ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందించారు.

నంద్యాల

మహానంది దేవస్థానం ఏఈఓ వై. మధుకు ఉత్తమ సేవా పురస్కారం

మహానంది దేవస్థానం ఏఈఓ వై. మధు కి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా ఆయన అందించిన సేవలను గుర్తించి సత్కరించడం పట్ల దేవస్థానం సిబ్బంది, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.