తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్
మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం లింగాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో రూ.13 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం కార్యదర్శిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన విషయం జన్నారం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

రూ.13 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కిన వైనం
తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్ మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం లింగాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో రూ.13 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం కార్యదర్శిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన విషయం జన్నారం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

