Wednesday, 2 September 2026
  • Home  
  • ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత పెంచాలి: నంద్యాల కలెక్టర్ రాజకుమారి
- నంద్యాల

ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత పెంచాలి: నంద్యాల కలెక్టర్ రాజకుమారి

నంద్యాల :ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించి, అర్జీదారుల్లో సంతృప్తి స్థాయిని పెంచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.అర్జీదారులను నేరుగా కార్యాలయానికి పిలిపించి సమస్యలు పరిష్కరించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని, ముఖ్యంగా ఆర్‌ఓఆర్‌ (ROR) అంశాల్లో పురోగతి సాధించాలని సూచించారు. త్వరలో ముఖ్యమంత్రితో కలెక్టర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో 39 కీలక పనితీరు సూచికలను (KPIs) వెంటనే అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.అలాగే, అధికారులు మరియు సిబ్బంది పెండింగ్‌లో ఉన్న ఐ-గాట్ (i-GOT) కోర్సులను వెంటనే పూర్తి చేయాలని, జిల్లాలో అమలుచేసే ఉత్తమ విధానాలపై నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ‘నెలలో నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు మండలాల్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రామునాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల :ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించి, అర్జీదారుల్లో సంతృప్తి స్థాయిని పెంచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.అర్జీదారులను నేరుగా కార్యాలయానికి పిలిపించి సమస్యలు పరిష్కరించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని, ముఖ్యంగా ఆర్‌ఓఆర్‌ (ROR) అంశాల్లో పురోగతి సాధించాలని సూచించారు. త్వరలో ముఖ్యమంత్రితో కలెక్టర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో 39 కీలక పనితీరు సూచికలను (KPIs) వెంటనే అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.అలాగే, అధికారులు మరియు సిబ్బంది పెండింగ్‌లో ఉన్న ఐ-గాట్ (i-GOT) కోర్సులను వెంటనే పూర్తి చేయాలని, జిల్లాలో అమలుచేసే ఉత్తమ విధానాలపై నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ‘నెలలో నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు మండలాల్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రామునాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.