ఖమ్మం: నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. దేవి మానస సోమవారం జిల్లా జైలును, బాలల సదన్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వసతులు, పరిసరాలను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అర్హత కలిగిన ఖైదీలు, బాలలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. న్యాయ సహాయం అవసరమైన వారిని గుర్తించి, వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ సకాలంలో న్యాయం అందేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు.



