-సంఘం రెడ్డి, రావుల బ్రదర్స్, చెన్నుపాటి ఆధ్వర్యంలో కోలాహలంగా వేడుకలు
-అభిమానులు, పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం
-శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్ష
పామూరు, సెప్టెంబర్ 1(పున్నమి ప్రతినిధి): విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో నందమూరి సుహాసిని పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సంఘం రెడ్డి అనూష (ఎస్.ఎస్. గోల్డ్ డైరెక్టర్), రావుల బ్రదర్స్, చెన్నుపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం అభిమానుల సమక్షంలో బాణాసంచాల మధ్య భారీ కేక్ కట్ చేశారు . అనంతరం స్థానికులు, పేదలతో పాటు అభిమానులకు పెద్ద ఎత్తున అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి చల్లని ఆశీస్సులతో ఆమె ఆయురారోగ్యలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రావుల ప్రవీణ్, రావుల జ్యోతి బాబు, రావుల నవీన్, పాశం సాంబశివ, రవి, బంకు ప్రసాద్, ముప్పిడి దుర్గారావు, మహేష్, గొలగని లోకేష్, రాజేష్, బడుగు నాని, చెట్టి కన్నా, గణపతి, నాని, పూలమామ, బాంబుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

