ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2026 రాష్ట్ర పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన 15 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి. ఈ సందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పతకాలు అందజేసి అధికారులను అభినందించారు.
ఉత్తమ సేవ పతకాలు అందుకున్న వారిలో అడిషనల్ డీసీపీ బి. రామానుజం, ARHC వి. బిక్షపతి, HC కె. సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు సేవా పతకాలు సాధించిన **కె. నాగేంద్రరావు (ఎస్ఐ), ఎన్. రామిరెడ్డి (ASI), బి. సుందర్ రావు (ASI), Md. హలీమ్ (ARSI), జి. భాస్కర్ రావు (ARSI), ఎం. వెంకటేశ్వర్లు (HC), టి. హరిచరణ్ సింగ్ (HC), Sk. మదార్ సాహెబ్ (HC), ఐ. ప్రభాకరరావు (HC), Ch. రామారావు (HC), జె. కృష్ణ (PC), డి. సుశీల్ కుమార్ (PC)లను సీపీ సునీల్ దత్ అభినందించారు
పోలీస్ శాఖలో నిబద్ధతతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు ఈ పతకాలు దక్కాయని సీపీ సునీల్ దత్ పేర్కొన్నారు. అవార్డులు అందుకున్న అధికారులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.


