అనంతగిరిలోని గిరిజన బాలికల పాఠశాల–2లో తెలుగు భాషా దినోత్సవం,జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పాఠశాల హెచ్ఎం బి.మంగమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని స్మరించుకున్నారు.అదేవిధంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి, మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు తెలుగు భాష ప్రాధాన్యత, మాతృభాష పరిరక్షణ ఆవశ్యకతతో పాటు క్రీడల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



