నంద్యాల : వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం, ఫైర్ సేఫ్టీ, ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నారు.ఎస్పీ సునీల్ షరాన్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వినాయక చవితి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
నంద్యాల : వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం, ఫైర్ సేఫ్టీ, ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలన్నారు.ఎస్పీ సునీల్ షరాన్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

