నంద్యాల శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ‘తెలుగు భాషా దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు.కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి అధ్యక్షుడు, ప్రముఖ అడ్వకేట్ ఎం. శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగును సామాన్యులకు అర్థమయ్యే వ్యవహారిక భాషగా తీర్చిదిద్దారని, మాతృభాషను కాపాడుకోవడం అంటే మన సంస్కృతిని కాపాడుకోవడమేనని వక్తలు పేర్కొన్నారు. యువత సాంకేతికతను ఉపయోగిస్తూ తెలుగు భాషను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు భాషా పరిరక్షణ ప్రతిజ్ఞ చేయగా, విశ్రాంత అధ్యాపకులు నీలకంఠం ఆచారి ప్రత్యేక కవిత వినిపించారు. కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు మాతృభాషా పరిరక్షణ మన అందరి బాధ్యత: శ్రీ రామకృష్ణ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం
నంద్యాల శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ‘తెలుగు భాషా దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు.కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి అధ్యక్షుడు, ప్రముఖ అడ్వకేట్ ఎం. శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగును సామాన్యులకు అర్థమయ్యే వ్యవహారిక భాషగా తీర్చిదిద్దారని, మాతృభాషను కాపాడుకోవడం అంటే మన సంస్కృతిని కాపాడుకోవడమేనని వక్తలు పేర్కొన్నారు. యువత సాంకేతికతను ఉపయోగిస్తూ తెలుగు భాషను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు భాషా పరిరక్షణ ప్రతిజ్ఞ చేయగా, విశ్రాంత అధ్యాపకులు నీలకంఠం ఆచారి ప్రత్యేక కవిత వినిపించారు. కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

