పాములపాడు :ప్రజలు జిల్లా కేంద్రానికి రానవసరం లేకుండా నియోజకవర్గ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. “వన్ మంత్–ఫోర్ విజిట్స్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో పాములపాడు, కొత్తపల్లి మండలాల ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. జయసూర్య, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 15 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భూ సమస్యలు, రీ-సర్వే, పింఛన్లు, తాగునీరు, గృహ నిర్మాణం, NH-340C భూసేకరణ నష్టపరిహారం సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజల చెంతకే పాలన: కలెక్టర్ రాజకుమారి గణియా
పాములపాడు :ప్రజలు జిల్లా కేంద్రానికి రానవసరం లేకుండా నియోజకవర్గ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. “వన్ మంత్–ఫోర్ విజిట్స్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో పాములపాడు, కొత్తపల్లి మండలాల ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. జయసూర్య, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 15 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భూ సమస్యలు, రీ-సర్వే, పింఛన్లు, తాగునీరు, గృహ నిర్మాణం, NH-340C భూసేకరణ నష్టపరిహారం సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

