Thursday, 3 September 2026

Tag: India

తెలంగాణ

డ్రగ్స్ కేసుల్లో ఈడీ భారీ సోదాలు

నషా ముక్త్ భారత్ లక్ష్యంలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దక్షిణాది రాష్ట్రాల్లో భారీ సోదాలు చేపట్టింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎనిమిది వేర్వేరు కేసుల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ సోదాలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణాతో ముడిపడిన ఆర్థిక లావాదేవీలు, నిధుల మార్గాలను గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా ఈడీ చర్యలు చేపట్టింది.

జాతీయ అంతర్జాతీయ

2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

జమిలి ఎన్నికల కోసం కేంద్రం నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) బిగ్ అప్డేట్ ఇచ్చింది. కమిటీ సంప్రదించిన వారిలో 99% మంది వన్ నేషన్-వన్ ఎలక్షన్కు మద్దతిస్తున్నట్లు JPC ఛైర్మన్ PP చౌదరి వెల్లడించారు. దీంతో 2034 కంటే ముందుగానే 2029లోనే జమిలి ఎన్నికలకు వెళ్లే ఆస్కారముందని చెప్పారు. ఇవాళి JPC భేటీలో ప్రియాంకా గాంధీ, చిదంబరం, సాగరికా ఘోష్, సుప్రియా సూలే తదితరులు పాల్గొని తమ వ్యూస్ పంచుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.