సీబీఐ విచారణకు సవాల్
డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్-1 ఆరోపణలపైనా విచారణకు తాము సిద్ధమన్నారు. సుగాలి ప్రీతి ఘటన, గంజాయి కేసులు, హిట్ అండ్ రన్, వివేకానందరెడ్డి హత్య కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ సోదాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.


