Sunday, 12 July 2026

Blog

అన్నమయ్య

సీలింగ్ ఫ్యాన్లు అందజేసిన బి.కొత్తకోట తహశీల్దార్ బావాజాన్‌

గతవారం బి.కొత్తకోటలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని తహశీల్దార్ బావాజాన్‌ తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యార్థులు ఫ్యాన్లు కావాలని కోరారు. దీంతో స్పందించిన అయన గురువారం నాలుగు సీలింగ్ ఫ్యాన్లను పాఠశాలకు బహుకరించారు. ఆయనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా బీజేపీ లో బయట పడ్డ విబేధాలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి. ఖమ్మం జిల్లా బిజెపి అంతర్గత విభేదాలు గురువారం బయట పడ్డాయి. బిజెపి పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు పుట్టినరోజు సంధర్భముగా స్థానికముగా ఒక ఫంక్సన్ హల్ నందు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. అయితే ఈ సమ్మేళనం కి ప్రతి ఒక్కరికి రావాలి అని వినోద్ రావు క్యాంప్ కార్యాలయం నుండి మెసేజ్ పంపడం జరిగింది అయినా కూడా బీజేపీ ప్రస్తుత జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్న రవికుమార్, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, నంబూరు రామలింగేశ్వరావ్, లతో పాటు పలువురు నాయకులు హాజరు అవ్వలేదు. దీన్ని బట్టి కార్యకర్తలు కానీ విశ్లేషకులు కానీ బిజెపి లో విబేధాలు ఉన్నాయా అని గుస గుస లాడుకుంటున్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల సమీపిస్తున్న వేల ఈ వర్ఘపోరు ఏంటి అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన పార్టీ జిల్లా కార్యలయం ప్రారంభం కి 29వ తేదీ న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఖమ్మం వస్తు న తరుణం లో ఈ వర్గ విభేదాలు ఎ విధంగా దారితతీస్తాయో చూడాలి.

ఆంధ్రప్రదేశ్

సుమనశ్రీ కి అరుదైన అవకాశం

ప్రసిద్ధ అయోధ్య రామాలయ నృత్యార్చన లో భాగంగా నందలూరు ఆడపడుచు కోడూరు సుమన శ్రీ రామాలయం ఆవరణం నందు రామ పరివారం నృత్యార్చనలో ఆంధ్ర కళాకారిణిగా పాల్గొనే అరుదైనఅవకాశం కలగడం గర్వకారణం అని ఈ సందర్భంగా కోడూరు సుమన శ్రీకి నందలూరు మండలం నుండి పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

హరిత గ్రామ సాధనలో భాగంగా మొక్కలు నాటిన మన్నెం

వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ అరవపల్లి జిల్లా పరిషత్ మైదానము నందు వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ డైరెక్టర్ SI మన్నెం. రామ మోహన్ సారధ్యంలో హరిత గ్రామ సాధన ప్రక్రియలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా SI మన్నెం రామమోహన్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచే క్రమంలో వృక్షో రక్షతి రక్షితః అన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని హరిత గ్రామమే లక్ష్యంగా జిల్లా పరిషత్ మైదానం నందు మునుపు కూడా మొక్కలు నాటి సంరక్షించడం జరిగింది . అలాగే ఇవాళ కూడా మరిన్ని మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం కోసం అందరూ భాగస్వాములై కలిసి రావడం చాలా సంతోషం కలిగించిందని తెలియజేశారు. వర్షాకాలం మొదలైనందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం కోసం ముందుకు రావాలని తద్వారా పచ్చదనం పెంపొందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందలూరు PHC కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తనికంటి వెంకటనారాయణ,మోడపోతుల రాము, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ఆ ధ్వర్యంలోకలెక్టర్ కి వినతి పత్రం సమర్పణ

*బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు చావా కిరణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పణ* ఖమ్మం పున్నమి ప్రతినిధి. కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ముఖ్య అతిధి గా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ ప్రతి పక్షం లో ఉన్నప్పడు వరంగల్ లో రాహుల్ గాంధీ సాక్షం గా చేసిన రైతన్న ల మీద చేసిన తీర్మానము ని నేడు అధికార ము లో కి వచ్చిన తరువాత పెడ చెవిన పెట్టింది అని ఆ తీర్మానం ని వెంటనే అమలు చేయాలి అని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేసారు అధికారము లోకి రావడం కోసం రైతులని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది అని అన్నారు. ప్రధాన మంత్రి ఫజల్ బీమా ని అమలు చేయాలి అని, బేషరత్తు గా 2 లక్షలు రుణ మాఫీ అమలు చేయాలి అని బిజెపి రాష్ట్ర నాయాకులు గల్లా సత్య నారాయణ ప్రభుత్వం ని డిమాండ్ చేసారు. ఎన్నికల కి ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకి హాయ్ చెప్పాడం ఎన్నికలు పూర్తి అయ్యాక బై చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వం కి కొత్త కాదు అని ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు అన్నారు. జిల్లా లో నకిలీ విత్తనాలు ని నివారణ చేయడం లో ప్రభుత్వం విఫలం అయింది అని జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో భూక్యా శ్యాం సుందర్ నాయక్, డీకోండశ్యాం, విజయ రెడ్డి, గజ్జల శ్రీనివాస్, అప్పారావ్, లక్ష్మి నారాయణ, నాగేశ్వరావ్ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఎరువులపై సమాచారం కొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

శ్రీకాకుళం, జూలై 24:రైతులకు ఎరువుల వినియోగం, సరఫరా విషయాల్లో సమగ్ర సమాచారం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాధ స్వామి గారు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కంట్రోల్ రూమ్‌ను ప్రాజెక్ట్ నియంత్రణ విభాగంలో ఏర్పాటు చేశారు. ఎరువుల లభ్యతపై సందేహాలు ఉన్న రైతులు 9121863788 నంబరుకు సంప్రదించి అవసరమైన సమాచారం పొందవచ్చు. ప్రస్తుతం జిల్లాలో సరిపడినంత ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే అవసరానికి మించి ఎరువులను ఉపయోగించడం వల్ల నేల సారం తగ్గిపోవడం, దిగుబడి తగ్గిపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు ఎరువుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 🌾 రైతుల సంక్షేమమే లక్ష్యంగా కంట్రోల్ రూమ్ సేవలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.

తెలంగాణ

శ్యామ్ రావు పటేల్ గారి అర్యోగ పరిస్థితి తెలుసుకున్న శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

తేదీ 23-07-2025 ఈ రోజు భైంసా మండలం లోని వాలేగాం గ్రామానికి చెందిన మాజీ pscs చైర్మన్ శ్యామ్ రావు పటేల్ గారు కంటి చికిత్స చేసుకోవడం జరిగింది వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఏమ్మెల్యే శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు వారితో పాటు ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు అష్ట శ్రీనివాస్ గారు మరియు SC సెల్ అధ్యక్షులు కుబీర్ మండలం జడే శ్రీనివాస్ గారు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

నిర్మల్

EX ఆర్మీ బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

తేదీ 23-07-2025 ఈ రోజు కుబీర్ మండలం లోని EX ఆర్మీ దొంతుల గణేష్ గారు ఇటీవల రహదారి ప్రయాణంలో అనుకోని పరిస్థితుల్లో స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు వారితో పాటు ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు మరియు భైంసా ఆత్మ కమిటీ చైర్మన్ సిద్ధం వార్ వివేకానంద గారు మరియు కుబీర్ మండలం అధ్యక్షులు బషీర్ గారు మరియు బంక బాబు గారు మరియు సాహెబ్ రావు గారు శివాజీ గారు సందీప్ గారు భూషణ్ గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు అష్ట శ్రీనివాస్ గారు మరియు SC సెల్ అధ్యక్షులు కుబీర్ మండలం జడే శ్రీనివాస్ గారు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

ఖమ్మం

తాండ్రా వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం టూ టౌన్ కమిటీ

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు జన్మదినము సం దర్భముగా ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ 53 వ డివిజన్ కంటెస్టెడ్ అభ్యర్థిని శ్రీమతి శ్రీలత ఆధ్వర్యంలో ఖమ్మం టూ టౌన్ బిజెపి కమిటీ తాండ్ర వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు

ఖమ్మం

తాండ్రా వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం టూటౌన్ కమిటీ

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్ట్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు జన్మదినము సందర్భముగ ఖమ్మం టూటౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ భాద్యులు వినోద్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.