Sunday, 12 July 2026

Blog

అనంతపురం

జూటూరు బషీర్ హెచ్చరిక. పెద్దారెడ్డి పై ఫైర్

తాడిపత్రి పున్నమి ప్రతినిధి జూలై 25 జూటూరు బషీర్ పెద్దారెడ్డి కి హెచ్చరిక ప్రశాంతంగా ఉంటున్న తాడిపత్రి ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు పెద్దారెడ్డి , మా ప్రభాకర్ రెడ్డి అన్న ఊర్లో లేనపుడు దొంగలాగా రావాలనుకుంటున్నవు కానీ నిన్ను రానివ్వము జూటూరు బషీర్ అంటే ఏమనుకుంటున్నావ్ నీకు ముందు ముందు తెలుస్తుంది , అంటున్న జూటూరు బషీర్ సైన్యం

అన్నమయ్య

రైల్వే కోడూరు అభివృద్ధి విషయమై గౌరవ ముఖ్యమంత్రి కీలక చర్చలు చేసిన ముక్కా రూపానంద రెడ్డి

రైల్వేకోడూరు జూలై 25 పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు అభివృద్ధిపై సీఎం తో ముక్కా రూపానంద రెడ్డి కీలక సమావేశంబాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అందిస్తున్న రిలీఫ్ ఫండ్ పంపిణీ సేవలను ప్రశంసించిన సీఎం రాష్ట్ర సచివాలయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియుకూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను సీఎం వివరించి, నూతన ప్రాజెక్టుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు.ప్రత్యేకంగా,రోడ్డు విస్తరణ,తాగునీటి ప్రాజెక్టులు,పట్టణ మౌలిక వసతుల విస్తరణపై ముఖ్యమంత్రి వినతులు అందజేశారు.అలాగే ఇటీవలే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయాన్ని అందుకున్న బాధితుల నివాసాలకు స్వయంగా వెళ్లి చెక్కులను పంపిణీ చేసిన ముక్కా రూపానంద రెడ్డి ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సేవాప్రవణతను సీఎం ప్రశంసించారు. ప్రజల మధ్య నేరుగా ఉండి సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సమావేశంలో కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండబోతుందని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆశీర్వచనాలు, మార్గనిర్దేశనం పట్ల ముక్కా రూపానంద రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం

ఆక్రమణ లు తొలగించి అభివృద్ధి పనులు చేపట్టాలి. బిజెపి నేత శ్రీనివాస్ రెడ్డి డిమాండ్

*ఖిల్లా చుట్టూ ఆక్రమాణాలు తొలగించి ఖిల్లా ని అభివృద్ధి చెయ్యండి* ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం ఖిల్లా అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం 29 కోట్లు కేటాయించినది. దీన్ని స్వాగటిస్తున్నాం అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.అయితే ఖిల్లా చుట్టూ ఉన్నంటటువంటి ఆక్రమణలు తొలిగించి ఖిల్లా కి వెళ్ళడానికి విశాలమైన దారిని ఏర్పాటు చెయ్యాలి అని, కుల మతాలకి ఆతీతం గా ఎవరు ఆక్రమించుకున్న తొలగించాలి అని తరువాత ఖిల్లా అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారూ

ఖమ్మం

తి. తి.దే ఆధ్వర్యంలో ఖమ్మం లో శ్రీవారి ఆలయం

ఖమ్మం పున్నమి ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మం లో శ్రీ వారి ఆలయం నిర్మిస్తూన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ తెలిపారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బి. ఆర్ నాయుడు కి ప్రతి పాదనలు పంపినట్లు తెలిపారు రఘు నాధ పాలెం లో దేవస్థాన నిర్మాణం కి అను వైన స్థలం ని టి. టి. డి బృందం పరీశీలించినది అని ఖమ్మం నగరానికి ఐ కాన్ గా శ్రీవారి దేవాలయ నిర్మాణం జరుగుతుంది అని మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ తెలిపారు.

ఖమ్మం

ఖిల్లా అభివృద్ధి కి 29 కోట్లు మంజూరు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా ని పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేసేందుకు కు గాను మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ చొరవ తో ఖమ్మం ఖిల్లా అభివృద్ధి కి ప్రభుత్వం 29 కోట్లు మంజూరు చేసింది అని జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి తెలియ జేశారు

అన్నమయ్య

గిట్టుబాటు ధర లేక రోడ్ ఎక్కిన బొప్పాయి రైతులు………

చిట్వేల్ జూలై 24 ( పున్నమి న్యూస్) బొప్పాయి రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో గురువారం ఉదయం రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. చిట్వేల్ అంబేద్కర్ సర్కిల్ నుండి రైల్వే కోడూరు కి వెళ్లే కాటా ఆవరణలో బొప్పాయి రైతులు మద్దతు టన్నుకు రూ.14,000 వేలు ఉండగా ఉన్నట్టుండి వ్యాపారస్తులు 8,000 కి తగ్గించడంతో బొప్పాయి రైతులు తీవ్ర ఆవేదనకు గురిఅయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని బొప్పాయి రైతులందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని ఒక యూనియన్ గా ఏర్పడి ప్రతి పంటలో వ్యాపారస్తులు చేస్తున్న అన్యాయానికి మండలంలోని అంబేద్కర్ సర్కిల్ రైల్వే కోడూరు కి వెళ్లే మార్గంలో కాటా నందు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న చిట్వేలీ మండల ఎస్సై నవీన్, పోలీస్ సిబ్బంది రైతులతో మాట్లాడుతూ వ్యాపారస్తులు, రైతులు మాట్లాడుకొని సామరస్యంగా వెళ్లాలని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అనంతరం మధ్యాహ్నం కాటా ఆవరణలో రైతులందరూ కలిసికట్టుగా ఏర్పడి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యాపారస్తులు బొప్పాయి రైతులకు టన్నుకు 16,000 వేలు మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే క్షేత్రస్థాయిలో ఈ ధర్నాని మరింత బలోపేతం చేసి రైతులతో కలిసి ఎక్కడికక్కడ వాహనాలు నిలుపుదల చేస్తామని రైతులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు వేసిన ప్రతి పంటలో వ్యాపారస్తులు, దళారులు, చేస్తున్న అరాచకాలను, గుర్తించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వానికి తెలియజేశారు

తెలంగాణ పెద్దపల్లి

వంద పడకల ఆసుపత్రి పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్* *వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష_* పెద్దపల్లి, జులై 24, పున్నమి ప్రతినిధి: సీజనల్ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుష్ ఆసుపత్రిని పరిశీలించి, నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి పనులు, నిర్మాణం పూర్తి చేసుకున్న తాత్కాలిక క్యాజువాలిటిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆసుపత్రి వెనుక ఉన్న చిన్న సందు విస్తరించి, అక్కడి నుంచి పేషెంట్ తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసులు తప్పనిసరిగా రిపోర్ట్ అయ్యేలా చూడాలని అన్నారు. ఈ తనీఖీలలో కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ విజయ్, నర్సింగ్ సూపరిండెంట్ జమున, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

మద్దతు ధర కల్పించాలని బొప్పాయి రైతులు ధర్నా

చిట్వేలి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ రైల్వే కోడూరు కి వెళ్లే కాటా ఆవరణలో బొప్పాయి రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో గురువారం ఉదయం రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బొప్పాయి రైతులకు టన్నుకు రూ.14,000 వేలు ఉండగా ఉన్నట్టుండి వ్యాపారస్తులు 8,000 కి తగ్గించడంతో బొప్పాయి రైతులు తీవ్ర ఆవేదనకు గురిఅయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని బొప్పాయి రైతులందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని ఒక యూనియన్ గా ఏర్పడి ప్రతి పంటలో వ్యాపారస్తులు చేస్తున్న అన్యాయానికి మండలంలోని అంబేద్కర్ సర్కిల్ రైల్వే కోడూరు కి వెళ్లే మార్గంలో కాటా నందు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న చిట్వేలీ మండల ఎస్సై నవీన్, పోలీస్ సిబ్బంది రైతులతో మాట్లాడుతూ వ్యాపారస్తులు, రైతులు మాట్లాడుకొని సామరస్యంగా వెళ్లాలని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అనంతరం మధ్యాహ్నం కాటా ఆవరణలో రైతులందరూ కలిసికట్టుగా ఏర్పడి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యాపారస్తులు బొప్పాయి రైతులకు టన్నుకు 16,000 వేలు మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే క్షేత్రస్థాయిలో ఈ ధర్నాని మరింత బలోపేతం చేసి రైతులతో కలిసి ఎక్కడికక్కడ వాహనాలు నిలుపుదల చేస్తామని రైతులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు వేసిన ప్రతి పంటలో వ్యాపారస్తులు, దళారులు, చేస్తున్న అరాచకాలను, గుర్తించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వానికి తెలియజేశారు.

ఖమ్మం

తాండ్ర వినోద్ రావు ని ఘనంగా సత్కరించిన ధనియాకుల

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జన్మదిన సందర్భంగా ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ వినోద్ రావు కి పుదీనా గజమాలతో సత్కరించడం జరిగింది. వీరితో పాటు దాసరి వీరభద్రం (రిటైర్డ్ సి ఐ )దాసరి మధు, శ్రీనివాస్ రెడ్డి, ఉపేంద్రమ్మ, అప్పారావ్, గజ్జల శ్రీనివాస్ టూ టౌన్ కమిటీ సభ్యులు ఉన్నారు.

అన్నమయ్య

గంటా న్యూరో హాస్పటల్‌లో రమణ రెడ్డి పరామర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

ఓబులువారిపల్లి మండలం, బలిరెడ్డి పల్లి గ్రామ వాస్తవ్వులు రమణ రెడ్డి గారు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా తిరుపతి గంటా న్యూరో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాస్పటల్ కు వెళ్లి రమణ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి శీఘ్రంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లొ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర జోగినేని మని పాల్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.