Sunday, 12 July 2026

Blog

అన్నమయ్య

బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న పులగంటి శివయ్య పరామర్శించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

చిట్వేల్ మండలం, నాగవరం వడ్డీ పల్లి గ్రామ వాస్తవ్వులు జనసేన పార్టీ కార్యకర్త పులగంటి శివయ్య బ్రెయిన్ స్ట్రోక్ తో తిరుపతి రమాదేవి హాస్పటల్ ICU లొ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయనను ఆసుపత్రిలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన తో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర జోగినేని మని శివయ్య గపరామర్శించారు.

ఖమ్మం

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లాబి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యువనేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో, కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు. కేక్ కటింగ్ అనంతరం లాంగ్ లీవ్ కేటీఆర్ అంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు… ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ: తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. MLC, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మరియు ఖమ్మం జిల్లాలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమైన విషయమై తెలిపారు. కేటీఆర్ గారు అధికారంలో ఉన్న లేకున్నా తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు, విద్యార్థులకు సమాజంలోని అన్ని వర్గాల వారికి ఉపయోగకరమైన కార్యక్రమాలకు పిలుపునిస్తూ.. ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థులకు లాప్టాప్ లు, ఫీజులు, ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులు, వికలాంగులకు వాహనాలు ఉపయోగపడే విధంగా సమాజానికి అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రగతిలో ఐటీ రంగం రాష్ట్రంలో విస్తృతంగా ఏర్పాటు చేయడంలో లక్షలాది ప్రైవేటు ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు అందించేందుకు కృషి కేటీఆర్ చేశారని, సామాజిక సేవలో నిత్యం ముందుండే కేటీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుకుంటూ.. కేటీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపడుతుందని పరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్ జె సి కృష్ణ, కూరాకుల నాగభూషణం, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, బి రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ బి రెడ్డి నాగచంద్ర రెడ్డి, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, బిచ్చల తిరుమలరావు, నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, రూరల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, రఘునాధపాలెం మండలం అధ్యక్షుడు వీరు నాయక్, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న, పిన్ని కోటేశ్వరరావు, కార్పొరేటర్లు శీలంశెట్టి వీరభద్రం, దండా జ్యోతి రెడ్డి, కూరాకుల వలరాజు, శ్రీవిద్య, బత్తుల మురళి, మాజీ ముదిగొండ మండల జడ్పీటీసీ సామినేని హరిప్రసాద్, మహిళా నాయకురాలు భారతి, కొల్లు పద్మ, నాయకులు బంక మల్లన్న, శంకర్, బిక్షం, ఇంటూరి శేఖర్, ముత్యాల వెంకటప్పారావు, మెంటం రామారావు, మీగడ శ్రీనివాస్ యాదవ్, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రసూల్, సద్దాం షేక్, మద్దెల విజయ్, మాటేటి కిరణ్, చీకటి రాంబాబు, షారుక్, ఆసిఫ్, అప్సర్, బురాన్, ఆరెంపుల వీరభద్రం, ఉస్మాన్, మన్సూర్, నెమలికొండ వంశీ,‌ నెమలి కిషోర్, నారమళ్ళ వెంకన్న, ఎల్వీ రత్నం, షకీన, శైలజా, మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

అన్నదాత సుఖీభవ పేర్లు లేని వారికి మరో అవకాశం వ్యవసాయ శాఖ అధికారి

చిట్వేలి జూలై 24 (పున్నమి ప్రతినిధి) అన్నదాత సుఖీభవ పథకంలో పేర్లు రాలేదని చాలామంది రైతులు బాధపడుతున్నారని అటువంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని చిట్వేలి మండల వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు రైతులు తమకు సంబంధించిన గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాయకుల వద్ద ఉన్న అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు పేరు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అన్నమయ్య

ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన

ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 24 చిట్వేలి మండలంలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి లబ్ధిదారులకు ఇచ్చే ఇనుప కడ్డీలు వర్షం ఎండల వల్ల తుప్పుపట్టి పనికిరాకుండా మారుతున్నాయి గూడెం ఉన్న సిమెంట్ కి మాత్రమే భద్రత కల్పించే ఇనుప కడ్డీలను బయట నిర్లక్ష్యంగా పడవేశారు చెడిపోయిన కడ్డీలు ఇండ్లు నిర్మించేందుకు పనికిరావని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించాలంటున్నారు

ఖమ్మం

సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

*సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు* ఖమ్మం పున్నమి ప్రతినిధి సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరిగాయి సత్తుపల్లి నియోజకవర్గం లోని సత్తుపల్లి, వెంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

నిర్మల్

*నాంపల్లి కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క*

పున్నమి ప్రతినిధి మూఢో కరోనా టైంలో నమోదైన కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు. బీఆర్ఎస్‌ హయాంలో ఇందిరాపార్క్‌ దగ్గర సీతక్క దీక్ష చేశారు. గాంధీనగర్‌ పీఎస్‌లో సీతక్క, ఎన్ఎస్ యుఐ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరయ్యారు మంత్రి సీతక్క. అయితే తామేం తప్పు చేయలేదు, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు సీతక్క. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేస్తే కేసులు పెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. కరోనా నుంచి పేదలను కాపాడాలనే ఆరోజు పోరాటం చేశానని చెప్పారు సీతక్క. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2021లో ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు చికిత్స అందించాలని ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్లు ఆసుపత్రిల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ కింద చెల్లించాలని కోరారు. అయితే కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసి కరోనా వ్యాప్తి చేస్తున్నారని అప్పటి ప్రభుత్వం సీతక్కపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా సీతక్క ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు…

నిర్మల్

*నాంపల్లి కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క*

పున్నమి ప్రతినిధి మూఢో కరోనా టైంలో నమోదైన కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు. బీఆర్ఎస్‌ హయాంలో ఇందిరాపార్క్‌ దగ్గర సీతక్క దీక్ష చేశారు. గాంధీనగర్‌ పీఎస్‌లో సీతక్క, ఎన్ఎస్ యుఐ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరయ్యారు మంత్రి సీతక్క. అయితే తామేం తప్పు చేయలేదు, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు సీతక్క. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేస్తే కేసులు పెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. కరోనా నుంచి పేదలను కాపాడాలనే ఆరోజు పోరాటం చేశానని చెప్పారు సీతక్క. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2021లో ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు చికిత్స అందించాలని ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్లు ఆసుపత్రిల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ కింద చెల్లించాలని కోరారు. అయితే కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసి కరోనా వ్యాప్తి చేస్తున్నారని అప్పటి ప్రభుత్వం సీతక్కపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా సీతక్క ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు…

ఖమ్మం

అభమానుల సమక్షంలో ఘనంగా వినోద్ రావు జన్మదిన వేడుకలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి పెద్దల దీవెనలు, మిత్రులా అభినందనలు, అభిమానుల శుభాకాంక్షలు నడుమ ప్రజానాయకుడు ఖమ్మం పార్లమెంట్ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి గౌరవ నీయులు తాండ్రా వినోద్ రావు జన్మదిన వేడుకలు గురువారం నగరము లో ఫంక్షన్ హల్ నందు ఘనంగా అయన అభిమానులు నిర్వహించడం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు గల్ల సత్యనారాయణ హాజరు అయ్యారు. ఈ సం దర్భముగా వినోద్ రావు మాట్లాడుతూ తన జన్మదినము సందర్భముగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనను ఒక కుటుంబ సభ్యుడిగా చేసుకొని తనను ఆదరిస్తునందుకు కృతజ్ఞతుణ్ణి అని అయన అన్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థాయి లో బీజేపీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తాను అని అన్నారు. కొత్తకోడలు అత్తారింటికి వచ్చినప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసినట్టు గా కొంతమంది చేస్తున్నారూ అని ఆ తప్పు లు తెలుసు కొని సరిద్దిద్దుకొని ముందు కు సాగాలని ఆలా కాకుండా ఇలానే ఉంటాను అని మొండికేస్తే నష్టపోతారు అని అయన అన్నారు. పార్టీ కోసం అందరిని కలుపుకొని ముందుకు పోవాలి అని అయన అన్నారు.

సినిమా

థియేటర్ లో సినిమా వీక్షించిన ఎమ్మెల్యే శ్రీధర్

హరిహర వీరమల్లు సినిమా విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురువారం థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పాత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నమయ్య

వైసీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దు

ఓబులవారిపల్లి మండలంలో జరిగిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో – బాబు షూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో గురువారం రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.వైసీపీకార్యకర్తలుఅధైర్యపడకూడదని, పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు, కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.