Sunday, 12 July 2026

Blog

నిర్మల్

బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

తేదీ 23-07-2025 ఈ రోజు భైంసా టౌన్ లోని నర్సింహ నగర్ లోని సరికొండ సుగుణ గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు వారితో పాటు ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు అష్ట శ్రీనివాస్ గారు మరియు SC సెల్ అధ్యక్షులు కుబీర్ మండలం జడే శ్రీనివాస్ గారు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

ఖమ్మం

దేవాలయ భూముల వెలం పాట

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పరిధిలో ని నేల కొండ పల్లి మండల కేంద్రం లో గల రాజా గోపాల స్వామి ఆలయ భూములు మూడు సంవత్సరాల కౌలు కి గాను 13 ఎకరాల 25 కుంటలు భూమి కి వేలం పాట నిర్వహించడం జరిగింది. రూ 2,41000 కి కాసిపోయిన ఉప్పలయ్య దక్కించుకున్నారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ మన్నే రవి ఈఓ శ్రీకాంత్ పూజారి రాము మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

అన్నమయ్య

అనగాని సత్య ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కె కె చౌదరి

బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారిని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్య ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి ఈ కార్యక్రమంలో టిడిపి క్షత్రియ నాయకులు, మాజీ సర్పంచ్ కీర్తిపాటి విజయ్ భాస్కర్ రాజు , కోడూరు నియోజకవర్గ తెలుగుయువత ఉపాధ్యక్షులు ఎమ్. నరేష్ పాల్గొన్నారు.

ఖమ్మం

వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ దివ్య శ్రీ

పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు పుట్టినరోజు సం ధర్భముగా భద్రాద్రి కొత్త గూడెం మొరం పల్లి బంజర్ మాజీ సర్పంచ్ దివ్యశ్రీ, బిజెపి సీనియర్ నాయకులు సీతారాం నాయక్ లు వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు

ఖమ్మం

నేడు వినోద్ రావు జన్మదిన వేడుకలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కంటెస్టడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జన్మదిన వేడుకలు నర్సింహా స్వామి టెంపుల్ రోడ్ నందు గల సరిగమప ఫంక్షన్ హల్ నందు ఉదయం 11 గంటలకు జరగనున్నాయి అని తాండ్ర వినోద్ రావు క్యాంప్ కార్యాలయ ఇంచార్జి పోతుల వీర చంద్ర శేఖర్ తెలిపారు

అన్నమయ్య

సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం

రైల్వే కోడూరు నియోజకవర్గం జూలై 23 (పున్నమి ప్రతినిధి) రైల్వే కోడూరు పట్టణం లక్ష్మీనగర్ ప్రాంతంలో రైల్వే కోడూరు ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం, అభిప్రాయాలు వినడం, ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన పథకాలపై ,భవిష్యత్తులో జరగబోయే అభివృధి పై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంచినీటి సమస్యలు, డ్రైనేజ్, రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రజలు చేసిన ఫిర్యాదులను గమనించారు. సమస్యలపై స్పందిస్తూ, వాటిని తక్షణమే అధికారుల తో మాటాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుపరిపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండటం. నేరుగా ప్రజల వద్దకు వెళ్లడం వల్ల వారికి ఉన్న వాస్తవ సమస్యలు తెలుస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకుంటాం. ఇది ఒక ప్రారంభం మాత్రమే. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి కుటుంబాన్ని కలిసేలా ప్రణాళికతో ముందుకెళ్తాం అని ముక్కా రూపానంద రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, స్థానిక కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీనగర్ ప్రజలు నేతల ప్రత్యక్షంగా ఇంటికొచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఖమ్మం

కూసుమంచి మండల బీజేపీ వర్క్ షాపు

పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలంలో భారతీయ జనతా పార్టీ కూసుమంచి మండల అధ్యక్షురాలు శ్రీమతి పుణ్యవతి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల ల్లో బిజెపి అభ్యర్థులు విజయం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి అని కోరారు పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్ నాయక్., కుసుమంచి మండల ప్రబారి ఓబిసి మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వీరుగౌడ్,రాష్ట్ర జిల్లా నాయకులు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

హైదరాబాద్

దత్తాత్రేయ ని ఉప రాష్ట్ర పతి ని చెయ్యాలి. ముఖ్య మంత్రి రేవంత్ సూచన

భారత ఉప రాష్ట్ర పతి గా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కి ఇవ్వాలని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. అయన కి ఉప రాష్ట్ర పతి పదవి ఇస్తే బి. సి లకి న్యాయం జరుగుతుంది అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే బండారు దత్తాత్రేయ ని ఉప రాష్ట్ర పతి ని చెయ్యాలి అని కోరుత అని తెలిపారు. ఆయన్ని ఉప రాష్ట్ర పతి అభ్యర్థి గా ప్రకటిస్తే ఇండి కూటమి తో తాను మాట్లాడుతా అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

ఖమ్మం

2023 I A S లకి సబ్ కలెక్టర్ లు గా పోస్టింగ్ లు

పున్నమి ప్రతి నిధి 2023 ఐఏఎస్ లకి సబ్ కలెక్టర్ లుగా పోస్టింగ్ లు ఇచ్చారు. 1)నారాయణ ఖేడ్ సబ్ కలెక్టర్ గా ఉమా హారతి 2)బైంసా : అజ్మీరా సంకేత్ కుమార్ 3)అర్ముర్ :అభిజ్ఞన్ మాల్వీయ 4)కల్లూరు :అజయ్ యాదవ్ 5)భద్రాచలం :మృనాల్ శ్రేష్ఠ 6)బెల్లం పల్లి : మనోజ్ లని నియమించారు

అన్నమయ్య

మంగంపేట దగ్గర చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న చైర్మన్ కె కె చౌదరి

ఓబులవారిపల్లి ( పున్నమి ప్రతినిధి )జూలై 23 బుధవారం టిడిపి యువనాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు గునిపాటి రామయ్య కుమారుడు గునిపాటి కిరణ్ తో కలిసి ఓబులవారిపల్లి మండలం, మంగంపేట నందు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి ఈ కార్యక్రమములో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు యువత సభ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.