దుత్తలూరు
05-5-2026( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని AP మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీ విద్యార్థులు 2026 SSC పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రకటించిన SSC ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25%గా నమోదవగా, విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు,
ఈ సందర్భంగా దుత్తలూరు AP మోడల్ స్కూల్లో టాపర్గా నిలిచిన CH కరీనా 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి మొదటి స్థానం పొందింది. రెండో స్థానం G మధుప్రియ (591 మార్కులు), మూడో స్థానం B లక్ష్మీ పూజిత (587 మార్కులు) దక్కించుకున్నారు.
ఈ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల వేదికపై ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్జి సైమన్ల్ గారు , ఉపాధ్యాయులు, స్కూల్త చైర్మన్ల్లి రమేష్దం సింగవరపు గారు, మరియు తల్లితండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ముఖ్యంగా టాపర్ కరీనా సాధించిన ఫలితంపై అందరూ ప్రశంసలు కురిపించారు.
పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, క్రమశిక్షణతో చదువుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో రాణించగలరని ఈ ఫలితాలు నిరూపించాయని తెలిపారు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ విజయంతో దుత్తలూరు AP మోడల్ స్కూల్ పేరు జిల్లాలోనే కాక రాష్ట్రస్థాయిలో కూడా నిలిచింది.


