మమత స్వచ్చంద సేవా సమితి వ్యవస్థాపక అద్యక్షులు. కోరుకొండ జాన్
పి. గన్నవరం ( పున్నమి ప్రతినిధి ) డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం కాటన్ మహనీయుడు నిర్మించిన బ్రిడ్జి కధ. పి గన్నవరం పాత బ్రిడ్జి ప్రభుత్వానికి అధికారులకు ఈ విధంగా మొరపెట్టుకుంటుంది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పి. గన్నవరం పాత బ్రిడ్జిని నిర్మించి సుమారు ఎనబై సంవత్సరాలు అయినది. కొత్త బ్రిడ్జి నిర్మించేవరకు బస్సులు లారీలు లెక్కలేనన్ని వాహణములు నాపై నడిపారు పి. గన్నవరం నుండి పొదలాడ లాకులు మీదుగా అంతర్యేదివరకూ పంటపొలాలకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు అందించాను .ఆ నీటితో పంట పొలాలు సత్య శ్యామలముగా మార్చాను ప్రజల దాహం తీర్చాను.ఇప్పుడు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రతీ సంవత్సరం వరదల సమయంలో ఇసుక ,మట్టి నా తొట్టిలో చేరి మట్టి దిబ్లలు వేసినాయి డొంకలు రెళ్ళు గడ్డి.రావి చెట్లు మొలిసాయి, ఈ సంవత్సరం మల్లి వరదలు వస్తే మల్లి ఇసుక మట్టి వచ్చి పడతాది.చూసే ప్రజలకు ఒక లంకల భూమి ఎడారి ప్రాంతములాగ నేను కనిపిస్తున్నాను. కొత్త బ్రిడ్జి. వరసకు నా తోభుట్టు చెల్లెలు అయిన శ్రీ డొక్కా సీతమ్మ వారధి మరమ్మత్తుల కోసం నాపై (పాత) బ్రిడ్జి పై రాకపోకలు సాగిచారు. ఎంతో ప్రతిష్టమైన పాత ఆనకట్టను బ్రిడ్జిని ఇప్పటికైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జల వనరుల శాఖ అధికారులు పాతవి బ్రిడ్జి కాలువ తొట్టెలో ఉన్న తొవ్వ మట్టి ఇసుకను వెంటనే తొలగించి నాపై ఉన్న భారాన్ని తగ్గించవలసిందిగాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని . జల వనరుల శాఖ( ఇరిగేషన్ డిపార్ట్మెంట్) అధికారులు కార్యాలయం దగ్గరలోనే ఉన్నారు .కాని నన్ను ఎప్పుడు చూడరు. నాపై కనికరం లేదు. కనీసం రిపేర్లు కూడా చేయడం లేదు. పట్టించుకోకపోతే నేను కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఇసుక మట్టి తొలగించి నన్ను కాపాడాలని. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ అధికారులు తక్షణమే స్పందించి పాత బ్రిడ్జి కాలవలో ఉన్న మట్టిని వెంటనే తొలగించి బ్రిడ్జిని రక్షించాలని. అధికారులు వెంటనే స్పందించాలని తగినచర్యలు తీసుకోవాలని పి గన్నవరం పాత బ్రిడ్జి కోరుచున్నదని .మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. డా. కోరుకొండ జాన్. ప్రభుత్వానికి అధికారులకు 5-5-2026 తేది మంగళవారం ఉదయం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.


