Sunday, 12 July 2026

Blog

చిత్తూరు

రోడ్లు, డ్రైనేజీలు లేక అవస్థలు పడుతున్న ప్రజలు

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కు చెందిన లక్ష్మీనగర్(లిటిల్ ఏంజిల్స్ స్కూల్ ఏరియా)కు మౌళిక సదుపాయములు లేకపోవడంతో అక్కడి వారు నానా అవస్థలు పడుతున్నారు.గత దశాబ్ద కాలం పైగా మురుగునీటి కాలువలు ఇప్పటికీ లేకపోవడంతో దాదాపు 150 ఇళ్ళ నుంచి బయటకు వస్తున్న మురుగునీరు వీధుల గుండా వస్తుండడంతో విధిలేక ఆ మార్గం లోనే ముక్కులు మూసుకొని తిరుగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఎగుడు దిగుడు రోడ్లతో నిత్యం కుస్తీ పడుతున్నారు. కాస్తా వర్షం కురిసినప్పుడు ఇంటి నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటుందని, బురదలో ప్రయాణించాలని కాలనీ వాసులు వాపోతున్నారు.ఈ సమయంలో మహిళలు వృద్ధులు చిన్న పిల్లలు పరిస్థితి వర్ణాతీతం అన్నారు.ఇటువంటి రోడ్లపై ద్విచక్ర వాహనాన్ని నడుపలేక బురదలో జారి పడిపోయిన సంఘటన లు అనేకంగా ఉన్నాయన్నారు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు వీధులలో ఆడుకొనే పరిస్థితి లేదన్నారు.దీనికి తోడు పాములు, విష పురుగులు యధేచ్చగా ఇండ్లలో వచ్చేస్తున్నాయoటున్నారు.ఇంకనూ తమ కాలనీకి కొళాయి కనెక్షన్ లు,పైపు లైన్ లు, వీధిలైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇలా చెప్పుకొంటూ పోతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ మున్సిపాలిటీ ప్రాంతంలోనే వెనుకబడిన కాలనీగా ఉందని అక్కడి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనుక ఇప్పటికైనా తమ కాలనీ వాసులకు మునిసిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు కలసి అత్యవసరoగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులు విజయశేఖర్ రెడ్డి,ఆంజనేయులు, ఏ.ఆర్.కుమార్,సెంథిల్ కుమార్, వెంకటాచలం,హరి ప్రసాద్, ధనంజయులు, జిలానీ,కస్తూరి,చంద్రారెడ్డి,విజయ్ కుమార్, సుబ్రమణ్యం, శివమోహన్, బాలసుబ్రమణ్యం, సుధాకర్ ,మాధవ్,వాసుమూర్తి తదితరులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

అన్నమయ్య

హరిహర వీరమల్లు “మహార్యాలీ”కి భారీ షురూ – బలిజ వీధి శ్రీ గంగమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు

రైల్వే కోడూరు నియోజకవర్గంలో “హరిహర వీరమల్లు” ఉద్యమాన్ని మహోత్సవంలా. బుధవారం బలిజ వీధి గంగమ్మ తల్లి ఆలయంలో గౌరవ ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో,ఆయన కల్యాణ పరిపాలనకు మద్దతుగా నిర్వహించారు. సంఖ్యలో జనసేన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అనగా జూలై 23న జరగబోయే మహార్యాలీకి ఇది ఓ శుభ సంకేతం.ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ అండగా నిలబడే సమయం ఇది. రాబోయే మహార్యాలీకి కుటుంబ సమేతంగా తరలిరండి.. మన డిప్యూటీ ముఖ్యమంత్రి కి మీ మద్దతును తెలియజేయండి” అని ప్రస్తుత.రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు – “రైల్వే కోడూరులో వీర మల్లు విశ్వరూపం చూపించాలి. యువత, కార్యకర్తలంతా ఏకతాటిపై ర్యాలీకి సిద్ధమవ్వాలి.. సాయంత్రం జరగబోయే ఈ మహా ర్యాలీలో మనకు మన నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని చాటి చెబుదాం” అంటూ జోష్ నింపారు.బుధవారం సాయంత్రం 5 గంటలకు “హరిహర వీరమల్లు” మహార్యాలీ ప్రారంభం. రైల్వే కోడూరు ప్రజలు, యువత, జనసేన అభిమానులుపెద్దఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుందాం.

ఖమ్మం

ఖమ్మం అభివృద్ధి అంటే ఇదేనా… బిజెపి నేత ధనియాకుల

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకుంటూన్న జిల్లా మంత్రులు వర్షా కాలం లో ఒక సారి ఖమ్మం పాత బస్ స్టాండ్, మరియు ఖమ్మం రోడ్ల ని పరిశీలిస్తే వారు అభివృద్ధి ఎంత వరకు చేసారో వారికే అర్ధం అవుతుంది అని ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ యాదవ్ అన్నారు. వర్షం కురిస్తే డ్రైనేజ్ లో నీరు రోడ్ల మీద కి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం లోనే సమస్య లు ఇలా ఉంటే రాబోయే కాలం లో ఇంకా సమస్య తీవ్రంగా ఉంటుంది అని అన్నారు. మంత్రులు, అధికారులు వెంటనే స్పందించి వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులని పరిష్కరించాలి అని ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్డ్ డిమాండ్ చేసారు.

ఖమ్మం

దళరులని నమ్మి మోస పోవద్దు. ఖమ్మం జిల్లా వైద్యాశాఖ అధికారిని కళావతి భాయ్

ఖమ్మం పున్నమి ప్రతినిధి జిల్లా వైద్య శాఖ లో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ డేట ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ లు ఖాళీ లేవని దళారుల మాయ మాటలు విని మోసపోవద్దు అని ఖమ్మం జిల్లా వై ద్య శాఖ అధికారి శ్రీమతి కళావతి భాయ్ తెలిపారు. ఒక వేల ఖాలి లు ఏర్పడితే ప్రభుత్వం యొక్క నియమ నిబంధన లకి లోబడి పూర్తి చేస్తమే తప్ప దళారులతో కాదు అని ఆమె తెలిపారు. ఇటీవల కాలం లో ఇటువంటి సంఘటన లు తమ ద్రుష్టి కి వచ్చాయి అని అందుకే ప్రకటన విడుదల చేసినట్లు ఆమె తెలిపారు

తెలంగాణ యాదాద్రి భువనగిరి

జాతీయ చేనేత పురస్కారాలకు ఇద్దరు తెలంగాణ నేతన్నల ఎంపిక

*జాతీయ చేనేత పురస్కారాలకు ఇద్దరు తెలంగాణ నేతన్నల ఎంపిక* హైదరాబాద్, జులై 23, పున్నమి ప్రతినిధి: చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం జాతీయ పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 24 మందికి జాతీయ అవార్డులు వరించాయి. మొత్తం 24 అవార్డుల్లో 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత అవార్డులున్నాయి. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు చేనేతలు గూడ పవన్, గజం నర్మద ఎంపిక అయ్యారు. వీరికి ఆగస్టు 7న న్యూఢిల్లీలో రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే వీరిద్దరి స్వస్థలం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం కావడం గమనార్హం. కాగా ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కేంద్ర అవార్డుకు ఎంపిక కావడం పట్ల పుట్టపాక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ చేనేత అవార్డులు-2024కు ఎంపికైన ఇరువురికి తెలంగాణ రాష్ట్రంలోని పలు చేనేత సంఘాలు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు అభినందించారు.

భద్రాద్రి కొత్తగూడెం

జాతీయ st కమిషన్ సబ్యూడిని కలిసిన సీతారాం నాయక్

పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బిజెపి సీనియర్ నాయకులు సీతారాం నాయక్ జాతీయ st కమిషన్ సభ్యులు జాటోతూ హుస్సేన్ నాయక్ ని మర్యాద పూర్వకముగా కలిసారు

ఖమ్మం

బాధితులకి పరామర్శించిన బిజెపి నేతలు

ఖమ్మం రెండవ పట్టణం పరిధిలోని 10 డివిజన్ 100 వ బూతు (సుందరయ్య నగర్ కాలనీలో) పిట్టల లక్ష్మి గారి ఇంట్లో రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ లీకేజై,,ఇంట్లో భారీ ఆస్తినాష్టం జరగడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 డివిజన్ శక్తికేంద్ర ఇంచార్జ్ జ్యోతుల యుగంధర్ గారి అధ్యక్షతన వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది,, ఈ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో రెండో పట్టణం ప్రధాని కార్యదర్శి రుద్ర గాని మాధవ గౌడ్ గారు,, రెండో పట్టణ ఉపాధ్యక్షులు భూక్య వెంకట్ గారు,, 57వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ బోయినపల్లి సురేష్ గౌడ్ గారు,, 100వ బూత్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు,, గురుస్వామి గారు,, పరమేష్ గారు,, వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.

ఖమ్మం

నందమూరి రామ కృష్ణ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నల్లమల్ల రంజిత్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నవరస నటన సార్వాభౌమ కీర్తి శేషులు నందమూరి తారక రామ రావు తనయుడు నందమూరి రామకృష్ణ జన్మదినము సం ధర్భముగ ఖమ్మం జిల్లా నందమూరి వీరాభిమాని ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్ బుధవారం హైదరాబాద్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

ఖమ్మం

దేశ భక్తుల జయంతి సందర్భముగా నివాళులు అర్పించిన జిల్లా బిజెపి నేత వల్లల

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారత దేశ స్వాతంత్ర్య సం గ్రామం లో పాల్గొని దేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమర యోధులు చంద్రశేఖర్ అజాద్. బాలా గంగా ధర తిలక్ జయంతి నేడు వారికి కి ఖమ్మం జిల్లా బిజెపి నాయకులు వాళ్ళలా రమేష్ ఘన నివాళులు అర్పించారు.

ఖమ్మం

దేశ భక్తుల జయంతి సందర్భముగా నివాళులు అర్పించిన బిజెపి నేత వల్ల

ఖమ్మం పున్నమి ప్రతినిధి భారత దేశ స్వాతంత్ర్య సం గ్రామం లో పాల్గొని దేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమర యోధులు చంద్రశేఖర్ అజాద్. బాలా గంగా ధర్ తిలక్ జయంతి నేడు.ఖమ్మం జిల్లా బిజెపి నాయకులు వారి కి ఘన నివాళులు అర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.