Sunday, 12 July 2026

Blog

ఖమ్మం

హరితహారం కార్యక్రమం లో మొక్కలు పంపిణి

నేల కొండపల్లి పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో గల నేల కొండ పల్లి మండలం బొదుల బండ గ్రామం లో శనివారం హరితహారం కార్యక్రమం లో భాగంగా మామిడి మొక్కలు పంపిణి చేశారు.దాత ఓరుగంటి నారాయణ రావు ఆర్థిక సహాయం తో 200మొక్కలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో సొసైటీ అధ్యక్షులు ఎటుకూరు రామారావ్ , కార్యదర్శి రమణ గుప్తా గ్రామస్థులు పాల్గొన్నారు

ఖమ్మం

బీసీ రిజర్వేషన్ ల మీద బిజెపి యువనేత స్పందన

ఖమ్మం పున్నమి ప్రతినిధి (ఖమ్మం రూరల్ మండలం) బిసి రిజర్వేషన్ ల మీద బీజేపీ ఖమ్మం జిల్లా యువ నాయకులు వల్లాల రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం, రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తాం, బీసీలకు బడ్జెట్లో ప్రతి ఏటా 20 వేల కోట్లు కేటాయిస్తాం, బీసీ బిడ్డలు వ్యాపారం చేసుకోవడం కోసం కానీ చదువు కోసం కానీ 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని చెప్పింది, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేయకుండా బీసీలను మోసం చేస్తుందనిఅని అన్నారు, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని అదే విధంగా ఈ రాష్ట్రానికి ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలని రమేష్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు, కాంగ్రెస్ అబద్దాలను నమ్మి మోసపోయిన బీసీ బిడ్డలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని వల్లాల రమేష్ యాదవ్ అన్నారు

ఖమ్మం

42% బిసి రిజర్వేషన్ లని బీసీ లకే అమలు చెయ్యాలి

ఖమ్మం పున్నమి ప్రతినిధి కామరెడ్డి బిసి దీక్లరేషన్ లో పేర్కొన్నట్లు 42% రిజర్వేషన్ ని పూర్తి గ బిసి లకే అమలు చెయ్యాలి అని బిజెపి ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. బిసి లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వారి హక్కుల ని కాల రాస్తుంది అని మండిపడ్డారు.బిసి రిజర్వేషన్ విషయం లో కాంగ్రెస్కి బిజెపిని ప్రశ్నించే హక్కు లేదన్నారు. బిసి రిజర్వేషన్ లో ముస్లిం లని చేర్చడం దూర్మార్గం అని ధనియకుల వెంకట్ నారాయణ యాదవ్ అన్నారు

ఖమ్మం

బోర్డు మీద ఆర్గానిక్ పాలు, అమ్మదేమో కంపెనీ పాలప్యాకెట్లు

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరము లో ప్రతి రోజు సుమారు 40 నుండి 50వేలు లీటర్ల పాల వ్యాపారము జరుగుతుంది. వీటిలో హెరిటేజ్, అమూల్, సంగం, విజయ లాంటి ప్రముఖ కంపెనీ పాలు వినియోగా దారులు వాడుతున్నారు. ఇక్కడ కొంతమంది స్వచ్ఛమైన డైరీ ఫామ్ ల నుండి తెచ్చిన పాలను అమ్ముతున్నారు. వినయోగ దారులు డైరీ ఫామ్ నుండి వచ్చే ఆర్గానిక్ పాల వినియోగం పై మక్కువ చూపుతున్నారు. ఇదే అవకాశం గా బావించి న కొంతమంది కేటు గాల్లు అనామకమైన పాల డైరీ ల నుండి పాలు సేకరించి క్యాన్ లలో నింపి వినియోగదారులకి విక్రయించి సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ న్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ లు ఇలాంటి పాల విక్రయదారులని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి వినియోగ దారులు కోరుతున్నారూ

తెలంగాణ

శాలిగౌరారం మండలంలో ఎమ్మెల్యేగారు సుడిగాలి పర్యటన

నల్గొండ జిల్లా పున్నమి ప్రతినిధి: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో పోలీసుస్టేషన్ ప్రక్కన 80 లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో నిర్మించిన సింగిల్ విండో భవనం మరియు గోదామును ఎమ్మెల్యే మందుల సామెలు గారు ప్రారంభించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు క్రొత్తగా వొచ్చిన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మండలంలోని NG కొత్తపల్లి గ్రామం, జాలోని గ్రామం, రామాంజపురం గ్రామాలలో MGNREGS నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మంచిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మండలంలోని అంబరిపేట గ్రామంలో నూతన గ్రామపంచాయతీకి శంకుస్థాపన చేసి, అనంతరం MGNREGS నిధులు 15 లక్షల రూపాయల సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈకార్యక్రమాలలో శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి గారు, AMC చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి గారు, మాదారం గ్రామం మాజీ ఎంపీటీసీ నోముల జనార్దన్ గారు, మండల నాయకుడు బెల్లి వీరభద్రం, వంగమర్తి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండె కిషోర్ గారు, కాంగ్రెస్ గ్రామ శాఖ బీసీ అధ్యక్షులు రూపని వెంకన్నగారు,మరియు ఇతర నాయకులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

ఖమ్మం

ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి:ఖమ్మం బాలయ్య హర్షం

పున్నమి ప్రతినిధి ఖమ్మం 71 వ జాతీయ ఉత్తమ తెలుగు చలన చిత్రం గా నందమూరి బాల కృష్ణ నటించిన *నేల కొండభగవంత్ కేసరి* ఎంపిక కావడం పట్ల ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్ హర్షం వ్యక్తం చేసారూ. ఈ సంధర్భముగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతు భగవంత్ కేసరి సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరికి ఖమ్మం జిల్లా బాలయ్య బాబు అభిమానుల తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు.

E-పేపర్

ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తెదేపా జంబూ సూర్య నారాయణ

ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి పాలన అని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ అన్నారు .. శుక్రవారం నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వితంతు పెన్షన్లను పెద్ద మొత్తంలో మంజూరు చేయడం జరిగింది అన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో 14 మంది మహిళలకు పింఛన్లను అందజేయడం జరిగిందన్నారు. కార్యాలయల చుట్టూ తిరక్కుండానే సంబంధిత మహిళలకు పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాచం కృష్ణమూర్తి గారి స్ఫూర్తితో భూ పోరాటాలకు సిద్ధం కావాలి

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి *సాయుధ రైతాంగ పోరాట యోధుడు కాచం కృష్ణమూర్తి గారి స్ఫూర్తితో భూ పోరాటాలకు సిద్ధం కావాలి* – *సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ పిలుపు* భూమికోసం, భుక్తి కోసం, పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం రాచరిక వ్యవస్థకు, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా బక్క చిక్కిన పేదలను ఒక్కటి చేసి వారి చేత బంధుకూలు పట్టించి సాయుధ రైతాంగ పోరాటంలో ముందు నడిచిన పోరాట యోధుడు, వందలాది ఎకరాల భూములను పేదలకు పంచిన భూ పోరాటాల దిక్సూచి కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి గారి 19వ వర్ధంతి స్ఫూర్తితో పేదలు, వ్యవసాయ కూలీలు మరోసారి భూ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి. జహంగీర్ పిలుపునిచ్చినారు. శుక్రవారం సుందరయ్య భవన్, భువనగిరిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి గారి 19వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. అనంతరం ” భూ భారతి – భూ సమస్యలను పరిష్కరిస్తుందా ” అనే అంశంపై చర్చా వేదిక కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ ఆనాడు వెట్టి చాకిరికి, దోపిడికి, బానిస విధానానికి ఆత్మగౌరవ పోరాటాలు, భూమి బుక్తి విముక్తి పోరాటాలు నిర్వహిస్తే ప్రజలు నేటి వరకు స్వేచ్ఛగా జీవిస్తున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. కానీ దేశంలో అధికారంలో చేపట్టిన బిజెపి గత పది సంవత్సరాల్లో అనేక చట్టాలను మారుస్తూ ప్రజల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీయాలనె కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. భారత దేశాన్ని దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేసి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో దళారుల రక్షణ కోసం, కార్పొరేట్ శక్తులకు, భూస్వాములకు తిరిగి భూములను అప్పజెప్పడానికి ధరణి అనే చట్టాన్ని తెచ్చి రైతులను, పేదలను ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. ధరణి చట్టం వల్ల అనేకమంది పేదలు నూతన పాసుబుక్కులు రాక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరమయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంలో ఉన్న కొన్ని లోపాలను సరిచేసి చట్టాన్ని అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధం కూడా ఎత్తివేయాలని అన్నారు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిని సర్వే చేసి ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ 120 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని, రెండు ఎకరాలు చొప్పున సాగు భూమి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. నాడు కృష్ణమూర్తి గారు కూలీల, రైతుల కార్మికుల సమస్యలపై పోరాడి అన్ని వర్గాల ప్రజా నాయకుడిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని వారి స్ఫూర్తిని కొనసాగించడానికి ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని వారు సూచించారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్యలు మాట్లాడుతూ దళారుల రక్షణ కోసం తెచ్చిన ధరణి చట్టాన్ని రద్దుచేసి భూ భారతి చట్టాన్ని తేవడాన్ని స్వాగతిస్తున్నామని కానీ గత ప్రభుత్వం అనుసరించిన విధంగా ఈ ప్రభుత్వము తమ విధానాలను అమలు చేయొద్దని సూచించారు. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా భూమి లేని పేదలను గుర్తించి వారందరికీ ప్రభుత్వ భూములను పంచాలని అన్నారు. ప్రజల చేతికి భూమి వస్తేనే దరిద్రం పోతుందని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందని వారు తెలియజేసారు. దేశంలో నరరూప రాక్షసుడైన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 ఆదివాసి గూడాల్లో ఐదు లక్షల ఎకరాల పైగా భూమి రక్షణ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయని అన్నారు. ఆనాడు కామ్రేడ్ కృష్ణమూర్తి లాంటి వాళ్లు అనేకమంది ప్రజల పక్షాన పోరాడి హక్కులను చట్టాలను సాధించుకున్నారని అన్నారు. ఈనాటి పాలకులు ఆ చట్టాలను, హక్కులను కాలరాయడానికి కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం రైతులు, కూలీలు, కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు, ఐలు జిల్లా అధ్యక్షులు బొల్లెపల్లి కుమార్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడవయ్య పాల్గొని మాట్లాడగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, తిరందాసు గోపి విజ్ఞాన కేంద్రం ట్రస్టు అధ్యక్షులు గద్దె నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిపంగి స్వామి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ , ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, సిపిఎం భువనగిరి పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ , రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డబోయిన వెంకటేష్ , ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య , కొండపురం యాదగిరి, నాయకులు కొండపురం పౌల్, మూడుగుల బాలరాజు, ఉప్పలయ్య , బండారి ప్రభాకర్, రాంబాబు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

*క్షేత్రస్థాయిలో పథకాల అమలు పరిశీలనకే జనహిత పాదయాత్ర శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు*

పున్నమి ప్రతినిధి నిర్మల్: ఈ రోజు భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణ్ రావు పటేల్ గారు కార్యకర్తల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పథకాల అమలు పరిశీలనకే జనహిత పాదయాత్ర 3వ 4వ తేదీల్లో ఖానాపూర్ మండలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నటరాజన్ మీనాక్షి గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ల పర్యటన కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ముధోల్ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్ లు మాజీ చైర్మన్లు మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీ లు మరియు ఎంపిటిసిలు మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు NSUI అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు ఎస్సీ సెల్ అధ్యక్షులు బీసీ సెల్ అధ్యక్షులు మైనారిటీ సెల్ అధ్యక్షులు మహిళా సంఘ అధ్యక్షులు ఎస్టి సెల్ ఆధ్యక్షులు కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.