హనుమాన్ జంక్షన్, మే 21 : పున్నమి ప్రతినిధి సురేష్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన వై ఎన్ ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్. ఆర్థిక కష్టాల్లో ఉన్న సదరు కుటుంబానికి స్వయం ఉపాధి మార్గాన్ని చూపించి మానవత్వం చాటుకున్న వైఎన్ఆర్ చారిటీ సంస్థ. గన్నవరం నియోజకవర్గంలో, బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలోని కృత్తివెంటి ఉదయ భాస్కర్ అనారోగ్య కారణం చేత ఉపాధి కోల్పోవడం జరిగింది. వారి జీవనోపాధి నిమిత్తం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తమకు జీవన ఉపాధి కల్పించాలని స్థానిక సమాజ సేవకులు కొల్లి బుజ్జి ను ఆశ్రయించగా తక్షణమే స్పందించిన వై ఎన్ ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ వారి ద్వారా లబ్ధిదారుని జీవనోపాధి నిమత్తం పచారి సరుకులు అమ్ముకోవడానికి బడ్డీ కోట్టును అందజేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఆర్సి మూర్తి, కొల్లి బుజ్జి రెబ్బన్ కట్ చేసి, లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో తమను ఆర్థికంగా ఆదుకుని, అండగా నిలిచిన వై ఎన్ ఆర్ చార్జెస్ సంస్థకు మరియు కొల్లి బుజ్జి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారుడు. ఈ కార్యక్రమంలో వై ఎన్ ఆర్ చారిటీస్ సభ్యులు వైయస్సార్సీ మూర్తి, కొల్లి బుజ్జి, వీరమాచినేని నాగయ్య, వీరమాచినేని రాంబాబు, మేడేపూడి రామ్మోహన్ రావు, తదితర స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



