Sunday, 12 July 2026

Blog

యాదాద్రి భువనగిరి

బ్రేకింగ్ న్యూస్

పున్నమి ప్రతినిధి సిద్దయ్య యాదాద్రి : చౌటుప్పల్ వద్ద రోడ్డుప్రమాదం… ఆటోను వెనకనుంచి ఢీకొన్న లారీ… ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు…ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు…

సంగారెడ్డి

నారాయణఖేడ్ ఆగస్ట్ 02 : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నారాయణఖేడ్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పూర్వ విద్యార్థులు రెండు లక్షల విలువైన సీసీ కెమెరాలను, ఎలక్ట్రిక్ బెల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి విద్యాబుద్ధులు నేర్పించిన పూర్వ ఆచార్యులకు, మాతాజీలకు సన్మానం చేశారు. ఇందుకుగాను పూర్వ విద్యార్థులను పాఠశాల ప్రబంధకారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వచార్యులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

E-పేపర్

సిర్గాపూర్ ఆగస్ట్ 02: గంజాయి సాగు, రవాణాపై ఎస్సై కీలక హెచ్చరిక

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఎస్సై మధుసూదన్ రెడ్డి గంజాయి సాగు, రవాణాపై శనివారం కీలక హెచ్చరిక చేశారు. గంజాయి వ్యవహారంలో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. వారి రైతుబంధు, కరెంట్ కనెక్షన్, పంట బీమా వంటి ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని తెలిపారు. పత్తి, కంది చేన్లలో గంజాయి వేస్తే నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

E-పేపర్

సిర్గాపూర్ ఆగస్ట్ 02: గంజాయి సాగు, రవాణాపై ఎస్సై కీలక హెచ్చరిక

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఎస్సై మధుసూదన్ రెడ్డి గంజాయి సాగు, రవాణాపై శనివారం కీలక హెచ్చరిక చేశారు. గంజాయి వ్యవహారంలో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. వారి రైతుబంధు, కరెంట్ కనెక్షన్, పంట బీమా వంటి ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని తెలిపారు. పత్తి, కంది చేన్లలో గంజాయి వేస్తే నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

అన్నమయ్య

రాజంపేట పార్లమెంట్ పరిధిలో “అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్” నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” మొదటి విడత నిధుల ప్రారంభోత్సవం సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారితో కలిసి రాజంపేట, తాళ్లపాక నందు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి.చైర్మన్ కె కె చౌదరి మాట్లాడుతూ కార్మికులు, కర్షకుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రైతులకు 50 రూపాయలకే ఉచిత విద్యుత్ అందించిన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అని, తర్వాత రైతులకు డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఎన్నో పథకాలను అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని, నేడు ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నది కూడా నారా చంద్రబాబునాయుడు గారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టి బాబు గారు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాప్ రాజు గారు, శరత్ కుమార్ రాజు గారు, మండల పార్టీ అధ్యక్షులు గన్నేసుబ్బ నరసయ్య నాయుడు గారు, ప్రభుత్వ అధికారులు, భారీ సంఖ్యలో రైతు సోదరులు పాల్గొని ఒక పండగ వాతావరణంలో రైతులు ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖమ్మం

బోళ్ల బిక్షపతి కుటుంబ సభ్యులని పరామర్శించిన గల్లా

ఖమ్మం పున్నమి ప్రతినిధి *భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బోళ్ల బిక్షపతి గారి తండ్రిగారు బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు గురువారం స్వర్గస్తులయ్యారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ గల్లా సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది* *ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ బోళ్ల బిక్షపతి గారి తండ్రి గారు బోళ్ల లక్ష్మయ్య గారి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబంతో తనకు 20 సంవత్సరాల అనుబంధం ఉన్నదని, బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు ఎప్పుడు చూసినా చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారిని, అదేవిధంగా బోల్ల చిన్న లక్ష్మి గారు వారి చిన్నతనంలో నాటకాల పైన ఉన్న శ్రద్ధతో శ్రీరాముని పాత్ర శ్రీకృష్ణుని పాత్ర పోషించారని, ఇప్పటికీ రామాయణం మహాభారతం గురించి ఈ తరం వారికి వివరిస్తూ ఉండేవారని, అటువంటి మంచి మనిషి ఆకస్మికంగా మరణించడం అత్యంత దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇటువంటి కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు*

ఖమ్మం

బోళ్ల బిక్షపతి కుటుంబ సభ్యులని పరామర్శించిన గల్లా

ఖమ్మం పున్నమి ప్రతినిధి*భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బోళ్ల బిక్షపతి గారి తండ్రిగారు బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు గురువారం స్వర్గస్తులయ్యారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ గల్లా సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది* *ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ బోళ్ల బిక్షపతి గారి తండ్రి గారు బోళ్ల లక్ష్మయ్య గారి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబంతో తనకు 20 సంవత్సరాల అనుబంధం ఉన్నదని, బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు ఎప్పుడు చూసినా చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారిని, అదేవిధంగా బోల్ల చిన్న లక్ష్మి గారు వారి చిన్నతనంలో నాటకాల పైన ఉన్న శ్రద్ధతో శ్రీరాముని పాత్ర శ్రీకృష్ణుని పాత్ర పోషించారని, ఇప్పటికీ రామాయణం మహాభారతం గురించి ఈ తరం వారికి వివరిస్తూ ఉండేవారని, అటువంటి మంచి మనిషి ఆకస్మికంగా మరణించడం అత్యంత దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇటువంటి కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు*

E-పేపర్

సంగారెడ్డి ఆగస్ట్ 02 : ఆపరేషన్ ముస్కాన్.. 126 మంది బాలలకు విముక్తి

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ విజయవంతమైనట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్తో జిల్లాలో 126 మంది చిన్నారులకు విముక్తి కలిగించి, వారు కోరుకున్న విధంగా తల్లిదండ్రులకు, పాఠశాలలు, సంబంధిత వారసులకు అప్పగించామన్నారు.

అన్నమయ్య

బొప్పాయి రైతుల సమస్యలపై సమీక్ష సమావేశం – రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపట్టిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు మరియు ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి

రైతులు, ట్రేడర్స్, వ్యాపారస్తులతో బొప్పాయి ధరల నిర్ధారణపై నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఒప్పందాన్ని కుదిర్చిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ మరియు ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఈనెల 5 తేది వరకు కిలో బొప్పాయి ధర రూ.9 వరకు ఫిక్స్,- తర్వాత రూ.10 రూపాయలు అని కలెక్టర్ గారు మరియు ముక్కా రూపానంద రెడ్డి తెలిపారుబొప్పాయి పంట రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ముక్కా రూపానంద రెడ్డి గారు తెలిపారుదళారి వ్యవస్థకు చెక్ – రైతుల పక్షాన నిలిచిన కలెక్టర్ మరియు ముక్కా రూపానంద రెడ్డి తక్షణ స్పందనబొప్పాయి రైతులకు దళారీలు మరియు వారి సేట్లు నుంచి విముక్తి కలిగించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడుతుంది అని ముక్కా రూపానంద రెడ్డి గారు తెలిపారుఅన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతుల సమస్యలపై జరిగిన సమీక్ష సమావేశం విజయవంతంగా పూర్తయ్యింది. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, బొప్పాయి సాగు చేసిన రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారనీ, దళారీ వ్యవస్థ కారణంగా వారు తీవ్రంగా మోసపోతున్నారని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో కేవలం రూ.9/- కేజీగా ఉన్న కొనుగోలు ధరను పెంచుతూ, ఇక నుంచి కనీసం రూ.10/- కేజీకి రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేయాలని ఆదేశించారు.రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని, దళారీ వ్యవస్థపై నిఘా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న _ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ“రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడుతుంది. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం,దళారీ వ్యవస్థను కట్టడి చేస్తాం అని తెలిపారు,రైతులు మాట్లాడుతూ తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వెంటనే స్పందించిన కలెక్టర్ మరియు రూపానంద రెడ్డి బొప్పాయి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ స్పందనతో పాటు టీడీపీ నాయకత్వం తమకు అండగా నిలవడాన్ని రైతులు సానుకూలంగా స్వీకరించారు.ఈ సమావేశం ద్వారా బొప్పాయి రైతులకు న్యాయం జరిగే దిశగా ప్రారంభమైన నూతన ప్రయాణం మీద ఆశలు నెలకొనడంతో పాటు అడ్డగోలుగా వారిని దోచుకుంటున్న దళారీ వ్యవస్థపై నియంత్రణ కూడా ఏర్పడుతుంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్నమయ్య

ఆపద వేళ అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి – ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.12 లక్షల పరిహారం అందించిన కలెక్టర్ శ్రీధర్ , ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రైల్వే కోడూరు నియోజకవర్గం శెట్టిగుంట గ్రామానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కుటుంబ భారం మోసే వ్యక్తులు హఠాత్తుగా మరణించడంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.ఈ విషాద ఘటన నేపథ్యంలో, కుటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సాయం అందిస్తూ, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షల పరిహారం మంజూరు చేసింది.రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులైన గజ్జల శ్రీను, గజ్జల వెంకటేశ్వర్లు మరియు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు సునీత, రాజేశ్వరి, గంగయ్య లకు పంపిణీ చేశారు.ఈ ఆర్థిక సహాయాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో రాత్రి అధికారికంగా పంపిణీ చేశారు.ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ: “ప్రభుత్వం ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తుంది. బాధిత కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ఇలాంటి విషాద సంఘటనలు మరల జరగకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.ప్రభుత్వ స్పందన పట్ల గ్రామస్తులు, బాధిత కుటుంబాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం, తమ జీవితాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి కొంతవరకైనా భరోసానిచ్చిందని వారు తెలిపారు.ఈ ఘటన కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా నిలుస్తుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.