Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఆగస్టు17 పున్నమి ప్రతినిధి : దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

హైదరాబాద్

బ్రేకింగ్ఎ న్యూస్ : ఎన్ డి ఎ ఉప రాష్ట్ర పతి అభ్యర్థి గా పీ రాధ కృష్ణ

పున్నమి ప్రతినిధి భారతదేశ ఉప రాష్ట్ర పతి ఎన్నిక నేపథ్యంలో అధికార ఎన్ డి ఎ కూటమి అభ్యర్థి గా ప్రస్తుత మహా రాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్న సి పి రాదకృష్ణ ని ఎన్ డి ఎ కూటమి నేతలు ప్రకటించారు. సోమవారం నాడు సీపీ రాధ కృష్ణ నామినేషన్ వేసే అవకాశం ఉంది

ఆంధ్రప్రదేశ్

రెండు,మూడు పథకాలతోనే సంబరాలొద్దు! గెడ్డం చంద్రశేఖర్

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి : రెండు,మూడు పథకాలతోనే సంబరాలొద్దు మిగిలిన వాటిిపై ప్రజలు ప్రశ్నిస్తారు జాగ్రత్త కూటమి సర్కార్ కు గెడ్డం చంద్రశేఖర్ హెచ్చరిక అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా సూపర్ సిక్స్ లో కేవలం మూడంటే మూడు హామీలను అమలు చేసి మొత్తం తన ఎన్నికల మేనిఫెస్టోనే అమలు చేసేసినట్లు కూటమి సర్కార్ సంబరాలు చేసుకొంటోందని వైసీపీ కార్యకర్త గెడ్డం చంద్రశేఖర్ విమర్శించారు. సూపర్ సిక్స్ లో ఇంకా మిగిలిన హామీలను కూటమి సర్కార్ విస్మరించినా ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకొంటారని, వాటిని కూడా అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమితో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో రెండేళ్లు కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి స్థంభించిపోయినా మూడేళ్లలోని చేసిన హామీలతోపాటు చేయని హామీలను కూడా వైయస్ జగన్ అమలు చేసి చూపించారని ఆయన గుర్తుచేశారు. అందుకే ఇపుడు వైయస్ జగన్ ను రాష్ట్ర ప్రజలు గుర్తుచేసుకొంటున్నారని, కూటమి సూపర్ సిక్స్ హామీలకు మోసపోయామన్న భావనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఎపుడొస్తాయా కూటమి సర్కార్ ఎపుడు ఓడిస్తామా అని ప్రజలే ఇపుడు ఆత్రుత్తగా ఎదురు చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీల అమలుకు వైయస్ జగన్ తరహా సంకల్పం కావాలి, ప్రజలను మభ్యపెట్టి తప్పించుకొనే తన నైజాన్ని చంద్రబాబు మరోసారి బయటపెట్టుకొన్నారని వైసీపీ కార్యకర్త గెడ్డం చంద్రశేఖర్ విమర్శించారు.

జోగులాంబ గద్వాల

నేత్రదానం చేసిన మురళీకృష్ణ.

అలంపూర్ : ఆగస్టు 17 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రఘురామయ్య శెట్టి కొడుకు మృతి చెందడంతో అతని రెండు కళ్ళను దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచిన కుటుంబాన్ని గ్రామస్తులు అందరూ అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన నరహరి రఘురామయ్య శెట్టి పెద్ద కుమారుడు నరహరి మురళీకృష్ణ (38) ఈ శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో 3 గంటలకు ఆయాసం వచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. శోక సముద్రంలో మునిగిన కుటుంబ సభ్యులందరూ కలసి మృతుడు మురళీకృష్ణ రెండు కళ్ళను దానం చేశారు. అతడు మరణించినా తన అవయవాలు ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వాలని సంకల్పంతో కళ్ళను దానం చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

అన్నమయ్య

నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి విశ్వనాథ నాయుడు గారు

చిట్వేలి మండలం కె.కందులవారిపల్లి గ్రామ వాస్తవ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కందుల గుండయ్య నాయుడు గారి కుమార్తె వివాహం 17-08-2025 ఆదివారం నాడు లక్ష్మీపురంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులు హర్షవర్ధని రెడ్డమ్మ – చెన్నకేశవులు ను ఆశీర్వదించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

అన్నమయ్య

“కానగల భాస్కర్” గారి పార్థివదేహానికి నివాళులర్పించిన బత్యాల

రైల్వేకోడూరు పట్టణం కొత్తకోడూరు నివాసి కానగల సుబ్బరాయుడు గారి కుమారుడు కానగల భాస్కర్ గారు నిన్న ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని భాస్కర్ గారిని స్మరించుకున్నారు.

అన్నమయ్య

రైల్వే కోడూరులో పంతగాని నరసింహ ప్రసాద్ జన్మదిన వేడుకలు

రైల్వేకోడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ గారి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి గారు పుట్టినరోజు కేక్ కట్ చేసి నరసింహ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరసింహ ప్రసాద్ గారు పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తూ యువతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

E-పేపర్

ఆర్టీసీ స్థలాన్ని “లులూ షాపింగ్ మాల్”కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 137 ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం :- ఇ. యు

ఆర్టీసీ ఆస్తులు కాపాడుకొనేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసి) ఆస్తులు ప్రైవేటు వ్యాపార వేత్తలకు దారదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపియస్ ఆర్టీసి గవర్నర్ పేట- 1&2 డిపోలు మరియు పాత బస్సుస్టాండ్ కు సంబందించిన 4.15 ఎకరాల స్థలం విలువ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఈ స్థలాన్ని లులూ షాపింగ్ మాల్ కు ప్రభుత్వం కట్టబెట్టి దశబ్దాలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న రెండు డిపోలలోని 200 బస్సులను 1100 మంది ఉద్యోగులను ప్రజలకు దూరం చేస్తూ బడా వ్యాపారవేత్తలకు కు జి. జి.ఓ.యం.యస్. ఓ. నెం. 137 ద్వారా కట్ట బెట్టిన GO ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆది వారం ఆర్.టి.సి ఎంప్లాయీస్ యూనియన్. జిల్లా కార్యదర్శి ఆర్.యస్.రావు ఆధ్వర్యంలో నిశాంతి భవన్.. హాలులో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోనక్ సహాయ కార్యదర్శి వి.దేవసహాయం మాట్లాడుతూ ఈ గవర్నర్ పేట డిపోలకు-1&2 మరియు పాత బస్టాండ్ స్థలాన్ని 1959 లో అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన ధర గజం రూ.16/- లతో సుమారు నాలుగు లక్షలు ఆరు వేల రూపాయలకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసినది. ఈ స్థలాన్ని ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వ్యాపార వేత్తలుకు దారాతత్తం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు ఈ ప్రభుత్వం నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధి చేసే పనిలో బాగంలో “లూలూ షాపింగ్ మాల్” ను నగర శివారు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా నగర నడిబొడ్డున నిరంతరం రద్దీగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న పాత బస్సుస్టాండ్ కు అనుబంధంగా ఉన్న డిపోలలో ఉన్న బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రేపు ఆగష్టు 15 మహిళకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆ సంఖ్య రెట్టింపు అవ్వనుంది. ఇటువంటి తరుణంలో ఈ డిపోలను ఇక్కడనుండి తొలగించడంవల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కావున జి.ఓ నెం. 137 తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము గతంలోని ఈ ప్రభుత్వ పెద్దలే 2014 సంవత్సరంలో విజయవాడ సమీపంలో ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలం 29 ఎకరాలను హెచ్.ఇ.యల్ కంపెనీకి కట్ట బెట్టారు. అందుకు బదులుగా ప్రభుత్వం ఇస్తామన్న స్థలం ఇప్పటివరకు ఒక్క గజం కూడా ఇవ్వలేదని అంతే కాకుండా 2017లో ఇదే గవర్నర్ పేట- 1&2 డిపోలు బఫర్ జోన్ కాలువ గట్టుపై ఉన్నాయని ఇంటర్ నేషనల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని దీనిని అప్పట్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే అప్పట్లో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు కలిసి జేఏసిగా పోరాటం చేసి అడ్డకున్నాయి. అని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందరి ఉద్యోగులాగే ఆర్టీసీ ఉద్యోగులుగా కోరుకున్నాము కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన DA బకాయిలను చెలిస్తాము, 12 PRC కమిషన్ వేస్తాము IR కూడా ఇస్తామన్న హామీల అమలు విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాక పోవడంపై ఎంప్లాయిస్ యూనియన్గా తీవ్రముగా ఖండిస్తున్నాము భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఇప్పటికే అలిపిరి డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది, ఈ బస్సులను ప్రైయివేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెడుతూ వారికీ ఆర్టీసీ డిపోలను అప్పచెప్పడాని రానున్న కాలంలో మరో 19 డిపోలలో ఇదే విధానం ప్రవేశ పెడుతూ ఆర్టీసీ డిపోలను, స్థలాలను ప్రెయివేట్ ఆపరేటర్లకు కట్టబెట్టాలనే ఆలోచనలను ఎంప్లాయిస్ యూనియన్ గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. సంస్థను ప్రైవేటీకరణ వైపు నడిపించే ఇటువంటి చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వమే సంస్థకు ఆర్ధిక సహాయం చేసి సంస్థే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహిచే విధంగా చర్యలు చెప్పట్టాలని కోరుతున్నాము దశాబ్దాల చరిత్ర గలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడడం చాలా బాధాకరమని ఇ.యు నాయకులు V. దేవసహాయం అన్నారు. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడు కొనేందుకు రాష్ట్ర నాయకత్వం నుండి ఏ పోరాటాలకు పిలుపు వచ్చినా సిద్ధంగా ఉంటామని తెలిపారు ఈ విలేకర్ల సమావేశంలో యూనియన్ నాయకులు జిల్లా కోశాధికారి డి.యన్.యస్.రాయుడు,జిల్లా ప్రచార కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు,డిపో అధ్యక్షులు కొండారెడ్డి,సహాయ కార్యదర్శి జి.యల్.రెడ్డి, సభ్యులు కాశీం,సుధాకర్ లు పాల్గొన్నారు

E-పేపర్

ఆర్టీసీ స్థలాన్ని “లులూ షాపింగ్ మాల్”కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 137 ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం :- ఇ. యు

ఆర్టీసీ ఆస్తులు కాపాడుకొనేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసి) ఆస్తులు ప్రైవేటు వ్యాపార వేత్తలకు దారదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపియస్ ఆర్టీసి గవర్నర్ పేట- 1&2 డిపోలు మరియు పాత బస్సుస్టాండ్ కు సంబందించిన 4.15 ఎకరాల స్థలం విలువ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఈ స్థలాన్ని లులూ షాపింగ్ మాల్ కు ప్రభుత్వం కట్టబెట్టి దశబ్దాలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న రెండు డిపోలలోని 200 బస్సులను 1100 మంది ఉద్యోగులను ప్రజలకు దూరం చేస్తూ బడా వ్యాపారవేత్తలకు కు జి. జి.ఓ.యం.యస్. ఓ. నెం. 137 ద్వారా కట్ట బెట్టిన GO ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆది వారం ఆర్.టి.సి ఎంప్లాయీస్ యూనియన్. జిల్లా కార్యదర్శి ఆర్.యస్.రావు ఆధ్వర్యంలో నిశాంతి భవన్.. హాలులో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోనక్ సహాయ కార్యదర్శి వి.దేవసహాయం మాట్లాడుతూ ఈ గవర్నర్ పేట డిపోలకు-1&2 మరియు పాత బస్టాండ్ స్థలాన్ని 1959 లో అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన ధర గజం రూ.16/- లతో సుమారు నాలుగు లక్షలు ఆరు వేల రూపాయలకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసినది. ఈ స్థలాన్ని ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వ్యాపార వేత్తలుకు దారాతత్తం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు ఈ ప్రభుత్వం నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధి చేసే పనిలో బాగంలో “లూలూ షాపింగ్ మాల్” ను నగర శివారు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా నగర నడిబొడ్డున నిరంతరం రద్దీగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న పాత బస్సుస్టాండ్ కు అనుబంధంగా ఉన్న డిపోలలో ఉన్న బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రేపు ఆగష్టు 15 మహిళకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆ సంఖ్య రెట్టింపు అవ్వనుంది. ఇటువంటి తరుణంలో ఈ డిపోలను ఇక్కడనుండి తొలగించడంవల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కావున జి.ఓ నెం. 137 తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము గతంలోని ఈ ప్రభుత్వ పెద్దలే 2014 సంవత్సరంలో విజయవాడ సమీపంలో ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలం 29 ఎకరాలను హెచ్.ఇ.యల్ కంపెనీకి కట్ట బెట్టారు. అందుకు బదులుగా ప్రభుత్వం ఇస్తామన్న స్థలం ఇప్పటివరకు ఒక్క గజం కూడా ఇవ్వలేదని అంతే కాకుండా 2017లో ఇదే గవర్నర్ పేట- 1&2 డిపోలు బఫర్ జోన్ కాలువ గట్టుపై ఉన్నాయని ఇంటర్ నేషనల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని దీనిని అప్పట్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే అప్పట్లో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు కలిసి జేఏసిగా పోరాటం చేసి అడ్డకున్నాయి. అని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందరి ఉద్యోగులాగే ఆర్టీసీ ఉద్యోగులుగా కోరుకున్నాము కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన DA బకాయిలను చెలిస్తాము, 12 PRC కమిషన్ వేస్తాము IR కూడా ఇస్తామన్న హామీల అమలు విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాక పోవడంపై ఎంప్లాయిస్ యూనియన్గా తీవ్రముగా ఖండిస్తున్నాము భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఇప్పటికే అలిపిరి డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది, ఈ బస్సులను ప్రైయివేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెడుతూ వారికీ ఆర్టీసీ డిపోలను అప్పచెప్పడాని రానున్న కాలంలో మరో 19 డిపోలలో ఇదే విధానం ప్రవేశ పెడుతూ ఆర్టీసీ డిపోలను, స్థలాలను ప్రెయివేట్ ఆపరేటర్లకు కట్టబెట్టాలనే ఆలోచనలను ఎంప్లాయిస్ యూనియన్ గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. సంస్థను ప్రైవేటీకరణ వైపు నడిపించే ఇటువంటి చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వమే సంస్థకు ఆర్ధిక సహాయం చేసి సంస్థే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహిచే విధంగా చర్యలు చెప్పట్టాలని కోరుతున్నాము దశాబ్దాల చరిత్ర గలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడడం చాలా బాధాకరమని ఇ.యు నాయకులు V. దేవసహాయం అన్నారు. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడు కొనేందుకు రాష్ట్ర నాయకత్వం నుండి ఏ పోరాటాలకు పిలుపు వచ్చినా సిద్ధంగా ఉంటామని తెలిపారు ఈ విలేకర్ల సమావేశంలో యూనియన్ నాయకులు జిల్లా కోశాధికారి డి.యన్.యస్.రాయుడు,జిల్లా ప్రచార కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు,డిపో అధ్యక్షులు కొండారెడ్డి,సహాయ కార్యదర్శి జి.యల్.రెడ్డి, సభ్యులు కాశీం,సుధాకర్ లు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ,బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

స్క్రోలింగ్ పున్నమి : 17-08-2035, 3PM. పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర,దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం దీని ప్రభావంతో రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి మత్స్యకారులు వేటకు వెళ్లరాదు ప్రఖర్ జైన్,ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.