Monday, 11 May 2026

Blog

E-పేపర్

ఓట్ చోరీపై రాహుల్‌ ఆరోపణలకు సీఈసీ కౌంటర్

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఓట్ చోరీపై రాహుల్‌ ఆరోపణలకు సీఈసీ కౌంటర్ ఆరోపణలపై ఏడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి అఫిడవిట్ ఇవ్వకపోతే దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి మహారాష్ట్రలో ఓట్లు పెరిగాయన్నది నిజమైతే.. సరైన సమయంలో రాహుల్ ఎందుకు అభ్యంతరం తెలపలేదు నకిలీ ఓట్లపై ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదు-ఈసీ ఎన్నికలు ముగిసిన 8 నెలలకు ఆరోపణలు చేయడమేంటి పదేపదే చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు-ఈసీ.

భక్తి

గోమాత

జై గోమాత గోవధ జరుగుతూ ఉంటే హిందూ జాతి మనుగడ ఉండదు హిందూ ధర్మం నిలబడాలంటే గోమాత తప్పనిసరి. గోమాత లేని హిందువులు ఊహించటం చాలా కష్టం. మన సనాతన ధర్మానికి మూలమే గోమాత. “యతో గావః తతో ధర్మః” అనగాఎక్కడైతే గోమాతలు ఉంటాయో, అక్కడ ధర్మం ఉంటుంది. గోమాత అనేది సర్వదేవతల సమాహారం. గోసేవ, గోరక్షణ వలన ధర్మం నిలుస్తుంది. వేదాలు, యజ్ఞాలు, పూజావిధానాలు అన్నీ గోమాతకు అనుసంధానమై ఉన్నాయి. గోమాత సమాజానికి పాలు, పోషణ, ఎరువు, ఇంధనం ఇస్తుంది. గోమాత ఉన్నచోట ఆరోగ్యం, సంపద, శాంతి, సమృద్ధి నిలుస్తాయి. అందువల్ల గోమాతను కాపాడటం = సమాజ ధర్మాన్ని కాపాడటం. మహాభారతం, వేదాలు, పురాణాలు అన్నిటిలో గోమాతను ధర్మస్థాపనలో ప్రధానంగా పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు కూడా గోపాలక రూపంలో ధర్మరక్షణ కోసం గోమాతను కాపాడాడు. గోమాతను రక్షించని హిందువు, తనను తాను రక్షించుకోలేడు.” గోసేవ ద్వారా అహింస, దానం, యజ్ఞ, భక్తి, యోగం అన్నీ సాధ్యమవుతాయి. గోమాత కాపాడని హిందువు, తన స్వీయ మూలాలను కత్తిరించుకున్నట్టే అవుతుంది. గోమాత రక్షణ లేకుండా హిందూ ధర్మం “నిర్జీవ శరీరం”లాగా మారుతుంది. క్రమంగా ఆచారాలు, సంస్కారాలు, ఆధ్యాత్మిక శక్తి క్షీణించి, హిందూ ధర్మం రూపం మాత్రమే ఉండి, సారాంశం కోల్పోయే ప్రమాదం ఉంది. గోమాత రక్షణ లేకపోతే ధర్మ స్థాపనకు అవరోధం ఏర్పడుతుంది. ఫలితంగా హిందూ సమాజం బలహీనమై, ఇతర మతాల ప్రభావానికి సులభంగా గురయ్యే అవకాశం ఉంటుంది. హిందువులు ఇతర మతాల్లోకి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం గో ధర్మాన్ని మనం కాపాడు కోలేకపోవటం వల్లనే జరుగుతున్నది. గోరక్ష జగద్రక్ష ధర్మస్య జయోస్తు

ఖమ్మం

నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు రెడ్ అలెర్ట్

ఖమ్మం ఆగష్టు ఖమ్మం పున్నమి దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్ నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి అని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలియ జేసినది. ములుగు, జయ శంకర భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో భారీ వర్షాలు పడతాయి అని అలాగే భూపాలపల్లి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి అని ఈ జిల్లా కి రెడ్ అలెర్ట్ జారిచేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నడవపల్లి సచివాలయంలో ఘనంగా79వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఆగస్టు 15 కాట్రేనికోన ది 15-08-2025 న కాట్రేని కోన మండలం నడవపల్లి పంచాయతీ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సర్పంచ్ అధ్యక్షతన వైభవం గా జరిగినది. ముందుగా సర్పంచ్ శ్రీమతి దొమ్మటి పల్లవి జండా ఎగరవేసినారు. జండా వందనం అనంతరం పంచాయతీ సెక్రటరీ ఏ సురేష్ మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.విద్యార్థులకు పెన్నలు పంపిణి చేసినారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఏ భారతి ,ముఖ్య అధితులు గా గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ గువ్వాల సత్తిబాబు పంచాయతీ ఐదో వార్డ్ నెంబర్ గ్రంధి నానాజీ,( డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , బిజెపి ట్రెజరర్ ). గ్రామ కమిటీ సెక్రటరీ పెమ్మాడి నాగమల్లేశ్వరరావు బూత్ ఇన్చార్జిలు మట్టపర్తి సాయి గుత్తులసూరిబాబు యూనిట్ ఇంచార్జ్ పాకలపాటి త్రినాధ్ వర్మ గ్రామ కమిటీ సభ్యులు పోలవరపు వెంకటరమణ మోటిపల్లి నాని అల్లూరి సోమరాజు గారు గెద్దాట సోమేశ్ డివివి సత్యనారాయణ పంచాయితీ సిబ్బంది సచివాలయం సిబ్బంది అంగన్వాడి సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్…///

పున్నమి న్యూస్ ఆగస్ట్ 17 :// దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

ఘనంగా భారతీయ జనతా పార్టీ రెబ్బన మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ గారి జన్మదిన వేడుకలు

రెబ్బెన మండలంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కొలిపాక కిరణ్ కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, జిల్లా నాయకులు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, గోలెం తిరుపతి, బీజేపీ రెబ్బెన మండల అధ్యక్షులు మల్రాజ్ రాంబాబు, బీజేఎమ్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇగురపు సంజీవ్, బీజేపీ మండల నాయకులు మండల మధుకర్, పందిర్ల కనకయ్య, ముంజల వెంకన్న గౌడ్, శ్రీనివాస్, అనిల్, ఆవునూరి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బ్రహ్మంగారి గుడి ప్రాంగణంలో చెన్నకేశవులు – హర్షవర్ధని రెడ్డమ్మ పెళ్లి మహోత్సవం

చిట్వేల్ మండలం బ్రహ్మంగారి గుడి ప్రాంగణంలో, 17 ఆగష్టు ఆదివారం రోజున కందుల వారి వివాహ వేడుక వైభవంగా జరిగింది. చిట్వేల్ మండలంలోని, కే కందులవారిపల్లి గ్రామానికి చెందిన. చిట్వేల్ మాజీ మండల అధ్యక్షుడు కందుల గుండయ్య నాయుడు గారి కుమార్తె హర్షవర్ధని రెడ్డమ్మ కు చెన్నకేశవులు తో శుభముహూర్తంలో పెళ్లి జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వేదికను పూలతో, దీపాలతో అలంకరించగా కళ్యాణోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. వివాహ వేడుకలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. అనంతరం విందు భోజనంలో పాల్గొన్న అతిథులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొత్త దంపతులకు సుఖసంతోషాలతో నిండిన గృహస్థ జీవితం కలగాలని అందరూ ఆకాంక్షించారు.

నిర్మల్

భారీ వర్షాల నేపథ్యంలో రేపటి ప్రజావాణి రద్దు

నిర్మల్ జిల్లా: ( పున్నమి ప్రతినిధి):- జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో నీటి ముట్టడి, రహదారుల దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తడంతో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

నిర్మల్

15 నిముషాల పాటు ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్

నిర్మల్ జిల్లా: ( పున్నమి ప్రతినిధి ) నిర్మల్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఆదివారం సాయంత్రం నుండి భారీ ట్రాఫిక్ మధ్య పట్టణవాసులు చిక్కుకోక తప్పలేదు. ఆర్టీసీ డిపోలోకి అధికారులు వెళ్లే బస్సుల పరిశీలన నిమిత్తం ఒక్క వాహనాన్ని లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. ఒక్కో బస్సు వెనకాల నిలబడిపోవడంతో మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయింది. దాదాపు 15 నిమిషాల పాటు ట్రాఫిక్ లోనే అంబులెన్స్ సైతం చిక్కుకుపోయింది. అలా సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ఫస్ట్ డిపో ఎదురుగా ట్రాఫిక్ భారీగా స్తంభించుకోవడం పట్ల పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఆర్టీసీ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయాన్ని కలగకుండా చూసేందుకు ప్రయత్నించారు.

నాగర్‌కర్నూల్

మంగనూర్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా ఆగస్టు 17:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని చిత్ర పటాన్ని మంగనూర్ గ్రామం లోని వీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణ భగవానుని భక్తులు,యువకులు, కోలాటాలు వేసి, డీజే పాటలకు నృత్యం చేశారు అనంతరం మంగనూర్ గ్రామం లోని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామం లోని చిన్నారులు,యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.అప్పల మాసయ్య యాదవ్ MA సంస్కృతం బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు , మంగనూర్ గ్రామం ప్రజలు కులాలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Video: https://youtu.be/cyhshm8oOmA?si=Qr8t_ZDDRYO7PZXP

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.