Sunday, 10 May 2026

Blog

ఖమ్మం

పాలేరు నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

పువ్వాడ నాగేంద్ర కుమార్ ఖమ్మం జిల్లా పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకుమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరి శెట్టి లు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు చేయడం జరిగింది. 👉శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు 👉తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు గ్రామంలో రూ. 4 కోట్ల 50 లక్షలతో పాలేరు నుండి మరిపెడ రోడ్డు స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు, 👉రూ. 2 కోట్ల 18 లక్షలతో సుబ్లేడు నుండి ఇస్లావత్ తండా వరకు బి.టి. రోడ్డు, 👉రూ. 5 కోట్ల 25 లక్షలతో సుబ్లేడు నుండి మాకుల తండా వరకు బి.టి. రోడ్డు, 👉రూ. 3 కోట్ల 15 లక్షలతో పిండిప్రోలు నుండి కేశవాపురం వరకు బి.టి. రోడ్డు, 👉రూ. 8 కోట్లతో పిండిప్రోలు నుంచి మన్నెగూడెం వరకు బి.టి. రోడ్డు, 👉నేలకొండ పల్లి మండలం కేంద్రంలో రూ. 25 లక్షలతో ఎ.వి.హెచ్ కొత్త భవన నిర్మాణం, 👉రూ.1.55 కోట్లతో గువ్వలగూడెం నుంచి బాలసముద్రం వరకు బి.టి. రోడ్డు, 👉రూ. 14 లక్షలతో అప్పల నరసింహపురం ఎస్సీ కాలనీ అంతర్గత సి.సి రోడ్లు, 👉రూ. 7 కోట్లతో నేలకొండ పల్లి నుంచి గండ్రాయి వరకు బి.టి.రోడ్డు, 👉రూ. 2.10 కోట్లతో కొత్త కొత్తూరు నుంచి బోదులబండ వరకు బి.టి. రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

కాకినాడ

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఏసీబీకి పట్టుబడ్డారు. సివిల్ కాంట్రాక్టర్ రాజబాబు పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి కమిషనర్ రూ.23వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అరుణాచలం ద్వారా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు….

ఆంధ్రప్రదేశ్

బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి @ మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసు, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు apdascac.ap.gov.in 3 చేసుకోవాలని సూచించారు.

అన్నమయ్య

వృత్తి విద్యా కోర్స్ నందు నైపుణ్యం పెంపొందించుకోవాలి

చిట్వేల్ ఆగస్టు (పున్నమి ప్రతినిధి) విద్యార్థులు తమ చదువుతోపాటు వృత్తి విద్య కోర్సు నందు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్ నందు నూతనంగా వృత్తి విద్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు మహమ్మద్ రఫీ ని టీచర్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ టీచర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, వృత్తి విద్యా కోర్స్ నందు ఆహార పదార్థాల తయారీ విధానం అనే యూనిట్ ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సాధారణ చదువుతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఈ కోర్సుల నందు విద్యార్థులకు ఉన్న నైపుణ్యం ద్వారా ఉన్నత కోర్సులు చేసుకోవడం సులభం అవుతుందని అన్నారు. ఈరోజు విద్యార్థులకు ఫుడ్ ప్రాసెసింగ్ టీచర్ మహమ్మద్ రఫీ “ఫ్రూట్ ట్రిపుల్ ఫుడింగ్” అనే ఆహార పదార్థాన్ని తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు నేర్పించడం జరిగింది. అలాగే విద్యార్థుల చేత స్వయంగా తయారు చేయించడం జరిగింది. ప్రభుత్వం పాఠశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు సంబంధించి రిఫ్రిజిరేటర్, మైక్రో ఓవెన్, ఇండక్షన్ స్టవ్, ఫ్రూట్ మిక్సర్, మిక్సీ, కేక్ తయారీ పాత్రలు మొదలైన సామాగ్రిని పాఠశాలకు అందివ్వడం జరిగింది. ఇప్పటికే పాఠశాలలో వృత్తి విద్యా కోర్సులైన ప్రథమ చికిత్స విభాగం, ఎలక్ట్రానిక్స్ విభాగం, ఐటీ విభాగం కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు తెలిపారు. ప్రభుత్వం కల్పించే ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని, అలాగే చుట్టుపక్కల ప్రజలు చదువుతోపాటు ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా టీచర్లైన మహమ్మద్ రఫీ చినబాబు, నాగమణి పాటు పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సుహాసిని, తెలుగు ఉపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్ మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

హత్య రాజకీయాలు చేస్తున్న రామిరెడ్డిని అరెస్టు చేయాలి..టిడిపి నాయకులు…

పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 21:/// కావలిలో హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని దగదర్తి మండలం టిడిపి ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి అన్నారు. రెండు రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నవరం క్వారీలో మాజీ ఎమ్మెల్యే కొంతమందిని రౌడీలను తీసుకువచ్చి తన అనుచరుల తో డ్రోన్ కెమెరా ద్వారా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆచూకీ తెలుసుకొని హత్య చేయించాలనుకోవడం దుర్మార్గపు చర్య అన్నారు. దానికి నిరసనగా దగదర్తి కెనరా బ్యాంక్ దగ్గర నుంచి ఎల్లిపోడు రోడ్డు వరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దిష్టిబొమ్మతో భారీ శవయాత్ర చేసి దహనం చేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ హత్య ప్రయత్నం చేసిన ప్రధాన సూత్రధారైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న టిడిపి నాయకులు,కార్యకర్తలు..

ఆంధ్రప్రదేశ్

3,9 డివిజన్ ఇంచార్జ్ లచే మాజీ ఎంపీ కి ఘన సన్మానం..///

పున్నమి న్యూస్, నెల్లూరు ఆగష్టు 21:/// నెల్లూరు జిల్లా వైసీపీ పెద్దలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఆయన యొక్క స్వగృహంలో వైఎస్ఆర్సిపి మూడవ డివిజన్ ఇంచార్జ్ అక్కల రెడ్డి నారాయణ. రెడ్డి మరియు 9వ డివిజన్ ఇంచార్జ్ ధనూజ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా పరిధిలోని రాజకీయ అంశాలపై చర్చించి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మేకపాటి కుటుంబం అందుబాటులో ఉంటూ తన యొక్క పూర్తి సహాయ సహకారాలు అన్ని వేళల అందిస్తూ ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. వారి వెంట ఎంపీటీసీ అక్కల రెడ్డి కొండారెడ్డి, దశరధి రామిరెడ్డి, రామచంద్రారెడ్డి, నాగరాజు మరియు సుబ్బయ్య పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సచివాలయాల్లో మొత్తం 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. దీంతో పాటు రాష్ట్ర అధికార భాష కమిషన్ కు మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్ గా పేరు మార్చారు. మరోవైపు పుష్కర ఎత్తిపోతల పథకంలో కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం, పంచాయతీ రాజ్, ఏపీ యాచక నిరోధక చట్టాల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

జీఓఎం జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై 3 బృందాలుగా మంత్రుల పర్యటన. ఈ నెల 29, 30 శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, తూ.గో.జిల్లాల్లో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత పర్యటన. వచ్చే నెల 2న అల్లూరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన. ఈ నెల 29న ప.గో., కృష్ణా జిల్లాల్లో మంత్రులు నాదెండ్ల, నారాయణ పర్యటన. ఈ నెల 30న చిత్తూరు, కడప జిల్లాల్లో మంత్రుల పర్యటన. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరులో మంత్రులు నిమ్మల, సత్యకుమార్ పర్యటన. వచ్చే నెల 2న గుంటూరు జిల్లాలో మంత్రుల పర్యటన.

తెలంగాణ

యూరియా కోసం వేచి ఉన్న రైతులతో మాట్లాడిన : మాజీ ఎమ్మెల్యే

నకిరేకల్ మండల కేంద్రంలోని తాటికల్ సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం పడి కాపులు కాస్తున్న రైతులతో మాట్లాడిన మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు. యూరియా కోసం ఎండలో నిలబడ్డ రైతులు,చంటి పిల్లలతో వచ్చిన మహిళ రైతులు, లైన్లో చెప్పులు,ఆధార్ కార్డులు పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతన్నల బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు అందించే సోయిలేదు, యూరియా సరఫరా చేసే సోయి లేదు,పండించే పంటను కొనుగోలు చేసే సోయి లేదు అని తెలిపారు. కెసిఆర్ హయాంలో ఒక్క సొసైటీలో ఎప్పుడు కూడా 1000 మెట్రిక్ టన్నుల కంటే తక్కువ ఎరువులు లేవని, ఇప్పుడు అవే సొసైటీలో 400 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే ఉన్నాయని,రైతు పైన నిజమైన ప్రేమ వారిపైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని రైతన్నకు కన్నీరు రానివ్వకండి అని యూరియాను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఇవాళ సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ ఇవాళ సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. సాస్కి తో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అదే రోజు రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.